Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
మాజీ భర్త గిఫ్టుగా అరుదైన పెయిటింగ్. రికార్డు ధరకు వేలం వేసిన ఎంజెలీనా జోలి
హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి ఓ అరుదైన పెయింటింగ్ను వేలం వేయగా రికార్డు స్థాయి ధర పలికింది. బ్రిటీష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ వేసిన పెయింటింగ్ను ఎంజెలీనా జోలికి 2011లో తన మాజీ భర్త బ్రాడ్ పిట్ బహుకరించారు. ఆ సమయంలో ఆ పెయింటింగ్ ఖరీదు రూ.2.95 మిలియన్ అమెరికన్ డాలర్లు. ప్రస్తుతం వేలం వేయగా దాని ఖరీదు 11.5 మిలియన్ అమెరికన్ డాలర్లు పలికింది. అంటే దీని ధర భారతీయ కరెన్సీలో రూ.85 కోట్లకుపైనే కావడం గమనార్హం.
విన్స్టన్ చర్చిల్ వేసిన టవర్ ఆఫ్ ది కౌటూబీయా మాస్క్ పెయింటింగ్ను 1943లో లండన్లో వేలం వేశారు. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంగా తెరకెక్కిన ఇంగ్లోరియస్ బెస్టెర్డ్ అనే చిత్రం షూటింగ్ సందర్భంగా విన్స్టన్ చర్చిల్ పెయింటింగ్ను సొంతం చేసుకొని ఎంజెలీనా జోలికి గిఫ్టుగా ఇచ్చారు. ఈ పెయింటింగ్ను పురాతన వస్తువుల డీలర్ ఎంఎస్ రావు నుంచి బ్రాడ్ పిట్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ అరుదైన పెయింటింగ్ను వేలం వేయడం చర్చనీయాంశమైంది.
బ్రాడ్ పిట్, ఎంజెలీనా దంపతులు తమ వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పారు. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2016లో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఈ క్రమంలో అరుదైన పెయింటింగ్ను ఎందుకు వేలం వేశారా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది.