Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మాజీ భర్త గిఫ్టుగా అరుదైన పెయిటింగ్. రికార్డు ధరకు వేలం వేసిన ఎంజెలీనా జోలి
హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి ఓ అరుదైన పెయింటింగ్ను వేలం వేయగా రికార్డు స్థాయి ధర పలికింది. బ్రిటీష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ వేసిన పెయింటింగ్ను ఎంజెలీనా జోలికి 2011లో తన మాజీ భర్త బ్రాడ్ పిట్ బహుకరించారు. ఆ సమయంలో ఆ పెయింటింగ్ ఖరీదు రూ.2.95 మిలియన్ అమెరికన్ డాలర్లు. ప్రస్తుతం వేలం వేయగా దాని ఖరీదు 11.5 మిలియన్ అమెరికన్ డాలర్లు పలికింది. అంటే దీని ధర భారతీయ కరెన్సీలో రూ.85 కోట్లకుపైనే కావడం గమనార్హం.
విన్స్టన్ చర్చిల్ వేసిన టవర్ ఆఫ్ ది కౌటూబీయా మాస్క్ పెయింటింగ్ను 1943లో లండన్లో వేలం వేశారు. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంగా తెరకెక్కిన ఇంగ్లోరియస్ బెస్టెర్డ్ అనే చిత్రం షూటింగ్ సందర్భంగా విన్స్టన్ చర్చిల్ పెయింటింగ్ను సొంతం చేసుకొని ఎంజెలీనా జోలికి గిఫ్టుగా ఇచ్చారు. ఈ పెయింటింగ్ను పురాతన వస్తువుల డీలర్ ఎంఎస్ రావు నుంచి బ్రాడ్ పిట్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ అరుదైన పెయింటింగ్ను వేలం వేయడం చర్చనీయాంశమైంది.
బ్రాడ్ పిట్, ఎంజెలీనా దంపతులు తమ వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పారు. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2016లో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఈ క్రమంలో అరుదైన పెయింటింగ్ను ఎందుకు వేలం వేశారా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది.