Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఏంజలీనా జోలీ-బ్రాడ్ పిట్ జంట కలిసేవుందోచ్..!!
ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ లు త్వరలో విడిపోనున్నారనే వార్తలు వెలువడినప్పడి నుండీ ఎందుకు విడిపోతున్నారు...?? అని కొన్ని మీడియాలు కథనాలు ప్రచురిస్తుంటే, మరికొందరు వారిద్దరూ విడిపోవడం లేదని కథనాలు ప్రచురిస్తున్నారు. మీడియానే రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరు బ్రాంజెలీనాలు కలిసే వున్నారని, మరికొందరు విడిపోయారని జనాన్ని ఊదరగొడుతున్నారు.
ఇదే విషయం అడుగుదామంటే వీరిద్దరూ ఈ విషయమై స్పందించడానికి సిద్ధంగా లేరు, కానీ మేమిద్దరం కలిసే వున్నామని చెప్పడానికి ఇటీవలే డైరెక్టర్స్ గిల్డ్ అవార్డుకు కలసి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా మార్చిలో జరగబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానిక తొలుత వెళ్లకూడదని అనుకున్నా, ఆ తర్వాత వచ్చిన వార్తలతో ఇద్దరూ కలసి ఆస్కార్ అవార్డుల్లో సందడి చెయ్యాలనుకొంటున్నట్టు తెలిసింది. ఈ పర్యటనతో పుకార్లు పుట్టించే వారి నోరు కట్టేయాలనుకుంటున్నట్టు ఈ బంట భావిస్తోంది. జోలీ-బ్రాడ్ లు ఆస్కార్ కార్యక్రమానికి రారని బాధ పడుతున్నవారికిదో తియ్యటి వార్తేమరి..!!