Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
75th Cannes Film Festival భారత్కు అరుదైన గౌరవం.. అక్షయ్ కుమార్ డుమ్మా.. ఏం జరిగిందంటే?
ప్రపంచ సినిమా పండుగగా పేర్కొన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. 75వ కేన్స్ ఫిలింఫెస్టివల్ కోసం భారతీయ సినిమా తారలు ఫ్రాన్స్కు చేరుకొన్నారు. ఈ వేడుకల్లో మార్చ్ ది సినిమాలో భారతదేశానికి అరుదైన గౌరవం దక్కింది. తొలి రోజున కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ థాకూర్తో కలిసి ఏఆర్ రెహ్మాన్, పూజా హెగ్డే, శేఖర్ కపూర్, తదితరులు రెడ్ కార్పెట్పై అడుగులు వేయనున్నారు. ఈ వేడుకల్లో అక్షయ్ కుమార్ కూడా పాల్గొనాల్సి ఉండగా... ఆయన కోవిడ్ పాజిటివ్ కారణంగా దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ట్వీట్ చేసి.. అనురాగ్ థాకూర్.. మీ అందరిని మిస్ అవుతున్నాను అని అన్నారు.
2022లో జరిగే కేన్స్ ఉత్సవాలల్లో ఆరు భారతీయ సినిమాలను ప్రదర్శించనున్నారు. వాటిలో రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్, గోదావరి (మరాఠీ), ఆల్ఫా బీటా, గామా (హిందీ, బొంబా రైడ్ (మిషింగ్), దుని (మైతిలీ) నిరాయే థతకాలుల్ల మారమ్ (మలయాళం) చిత్రాలు ఉన్నాయి.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో దీపికా పదుకోన్కు అరుదైన ఘనతను చేజిక్కించుకొన్నది. ఈ ఏడాది ఈ ఫెస్టివల్కు జ్యూరీగా వ్యవహరించనున్నారు. జ్యూరీగా ఎంపిక చేయడంపై ఇది నా వ్యక్తిగత విజయం అని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాసియాకు దక్కిన అరుదైన గౌరవం అని తెలిపారు.
ఇక కేన్స్ ఫిలింఫెస్టివల్లో పాల్గొనేందుకు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన భర్త అభిషేక్, కూతురు ఆరాధ్య బచ్చన్తో కలిసి ఫ్రాన్స్ వెళ్లారు. ఐశ్యర్య, పూజా హెగ్డే ముంబై ఎయిర్పోర్టులో మీడియా కెమెరాలకు ఫోజిస్తూ కనిపించారు.
మార్చ్ ద ఫిల్మ్ ఫెస్టివల్ డి కేన్స్లో భారత్కు అరుదైన గౌరవం దక్కడంపై ప్రధాని మోదీ ఇటీవల హర్షం ప్రకటించారు.