Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'అవతార్' సినిమాకు సీక్వెల్ ను తీసే ఆలోచనలో ఆ దర్శకుడు..!!
ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత సృష్టి 'అవతార్'. సుమారు 300 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా అద్భుతమయిన గ్రాఫిక్ మాయాజాలంతో ప్రపంచం మొత్తం విజయదుందుబి మోగించి రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. విడుదలయిన రెండు వారాలకే 600 మిలియన్ డాలర్లను వసూలు చేసి బిలియన్ డాలర్లను వసూలు చేసే దిశగా పరుగులు తీస్తోంది. కాగా జేమ్స్ కామెరూన్ ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
పాండోరా గ్రహం లోని ఖనిజాలను దోచుకోవాలనే దురాశతో అక్కడి ప్రకృతిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మానవులను ఏలియన్లను పోలిన అక్కడి వింత జీవులు అడ్డుకుంటారు. దీంతో వీరివురి మధ్య యుద్ధం మొదలవడం, ఈ ఏలియన్లకు కథానాయకుడు సాయపడటం, వారు విజయం సాధించడం ఇదీ అవతార్ సినిమా కథ క్లుప్తంగా. అతి సాధారణమయిన ఈ కథను అద్భుతమయిన సాంకేతిక విలువలతో, బిగుతైన స్క్రీన్ ప్లే తో రక్తి కట్టించడంలో కామెరూన్ ఘనవిజయం సాధించారనడం అతిశయోక్తి లేదు. దీంతో ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక రాబోయే సీక్వెల్ లో పాండోరా లో కాకుండా మరో గ్రహంలో జరిగే కథతో సినిమాను రూపొందించనున్నట్టు కామెరూన్ తెలిపారు. కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. 'టైటానిక్' వంటి సినిమాను సృష్టించిన పుష్కర కాలానికి ఈ అవతార్ సినిమాను విడుదల చేసిన కామెరూన్ ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చెయ్యడానికి ఎంత సమయం తీసుకుంటాడో...!!