Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ నుండి మరఠ్వాడా మహారాణిగా బిపాసా బసు..!
హాలీవుడ్ కి బిపాసా బసు వెళ్ళనుందని సమాచారం. వెళ్ళటం అంటే అక్కడికి ఏదో టూరిస్ట్ గా వెళ్ళటం లేదు. వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ నటీమణి బిపాసా బసు త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించనుంది. హాలీవుడ్ లో నిర్మిస్తున్న' సింగ్యులారిటీ' అనే చిత్రంలో బిపాసా బసు నటిస్తోంది. ఈ హాలీవుడ్ చిత్రంలో బిపాసా బసు మరఠ్వాడా మహారాణిగా నటిస్తుంది. అంటే మారాఠీ మహారాణిగా నటిస్తుందన్నమాట. ఈ మరాఠీ మహారాణికీ, ఒక బ్రిటీష్ సైనికుడికీ మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రంలో ఒక భాగంగా ఉంటుందట.
ఈ 'సింగ్యులారిటీ" చిత్రం మనకు స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటీష్ వారి కాలంనాటి కథతో నిర్మించబడుతోంది. బిప్స్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'టక్కరి దొంగ" అనే మన తెలుగు సినిమాలో నటించింది. అలాగే రీసెంట్ గా'దమ్ మారో దమ్" అనే హిందీ చిత్రంలో మన తెలుగు హీరో రాణా సరసన హీరోయిన్ గా నటించింది. గతంలో ఐశ్వర్యారాయ్, మల్లికా షెరావత్ వంటివారు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. మన తెలుగు సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లంతా బాలీవుడ్ కి వెళుతూంటే బాలీవుడ్ భామలంతా తమ దృష్టి హాలీవుడ్ పైకి సారిస్తున్నారు.