Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అతని చావు వార్త ఈ దశాబ్దపు పాపులర్ న్యూస్ అయింది..!!
ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ మరణ వార్త ఈ దశాబ్దపు అత్యధిక జనాధరణ పొందిన వార్తగా ఎంపికయింది. ఇటీవల అమెరికాకు చెందిన ఓ పత్రికా ఎడిటర్, స్థానిక టివీ ఛానెల్ సాయంతో నిర్వహించిన ఈ సర్వేలో మైఖేల్ మరణ వార్తను ఎక్కువ మంది బహుళ జనాధరణ పొందిన వార్తగా ఎంపిక చేసారు. అమెరికా మీద సెప్టెంబరు 11న జరిగిన దాడి, బరాక్ ఒబామా తొలి అమెరికా నల్ల జాతి అద్యక్షుడిగా ఎంపికవడం లాంటి వార్తలను వెనక్కు నెట్టి ఈ వార్త తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
కాగా గత జూన్ నెల 25వ తారీఖున ఈ పాప్ స్టార్ హఠాన్మరణం ప్రపంచంలోని ఎంతో మంది మంది సంగీతాభిమానులని శోకసంద్రం లో ముంచింది. ఆ తర్వాత ఆయన మరణానికి అతను వాడిన డ్రగ్సే కారణమని అందుకు భాద్యుడిగా అతని వ్యక్తిగత వైధ్యుడు డాక్టర్ ముర్రే ను విచారిస్తున్నారు. ఇంకా ఈ కేసు విచారణలో వుంది.
కాగా మైఖేల్ జాక్సన్ మరణానంతరం అతను లండన్ లో ఇవ్వనున్న షోకు రిహార్సల్స్ చేసిన వీడియోను డాక్యుమెంటరీగా రూపొందించి 'ది ఈజ్ ఇట్' పేరుతో విడుదల చెయ్యగా అది ఊహించని రీతిలో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.