Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మైఖేల్ జాక్సన్ ను మించిపోయిన రియాలిటీ షో సెలబ్రిటీ..!!
2009వ సంవత్సరం సెలబ్రిటీలకు అంతగా కలసిరాలేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సంవత్సరంలోనే మరణించారు. వీరిలో ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్, రియాలిటీ షో స్టార్ జేడ్ గూఢీ, 'బాయ్ జోన్' బ్యాండ్ సిగర్ స్టిఫెన్ గ్యాట్లీ, 'క్లూలెస్' స్టార్ బ్రిటానీ ముర్ఫి, సింగర్ డేవ్ డీ, నటి నటాషా రిచర్డ్ సన్ లాంటి వారు ప్రముఖులు. కాగా ఈ ఏడాది వీరిలో ఎవరి మరణం ఎక్కువ మందిని కలచివేసింది అనే ప్రశ్నతో ఓ ఆన్ లైన్ సైట్ సర్వే నిర్వహించింది.
ఇందులో ఎక్కువ మంది మైఖేల్ జాక్సన్ కే ప్రథమ స్థానం వస్తుందని భావించారు, కానీ ఆశ్చర్యకరంగా ఈ పాప్ స్టార్ రెండవ స్థానంలో నిలిచాడు. ప్రథమ స్థానంలో రియాలిటీ షో స్టార్ జేడ్ గూఢీ నిలిచింది. గూఢీ భారతీయ ప్రజలకు సుపరిచయమే. బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో బాలీవుడ్ నటీమణి శిల్పాశెట్టి మీద వివాదాశ్పద వ్యాఖ్యలు చేసి ఆమె ఈ రియాలిటీ షోలో నెగ్గడానికి పరోక్షంగా సాయం చేసింది గూఢీ. కాగా ఆ తర్వాత ఎన్నో సార్లు ఈ విషయమై క్షమాపణలు చెప్పిన గూఢీ ఆ తర్వాత భారతదేశంలో జరుగుతున్న బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో పాల్గొనడానికి వచ్చి అనారోగ్యం కారణంగా మధ్యలోనే వైదొలిగింది. ఆ తర్వాత ఆమె అడ్వాన్స్ స్టేజీలో వున్న సెర్వికల్ క్యాన్సర్ తో బాధపడుతూ మార్చి 22 న మరణించింది. చనిపోవడానికి నెల క్రితమే ఈమె తన బాయ్ ఫ్రెండ్ జాక్ ను వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు.
ఆ తర్వాత మూడవ స్థానంలో ఫోక్ సింగర్ మరియు రచయిత జాన్ మార్టిన్ నిలిచాడు. ఈ తర్వాతి స్థానాల్లో సింగర్ డేవ్ డీ, నటి నటాషా రిచర్డ్ సన్, 'బాయ్ జోన్' బ్యాండ్ సిగర్ స్టిఫెన్ గ్యాట్లీ లు నిలిచారు.