Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మైఖేల్ జాక్సన్ ను మించిపోయిన రియాలిటీ షో సెలబ్రిటీ..!!
2009వ సంవత్సరం సెలబ్రిటీలకు అంతగా కలసిరాలేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సంవత్సరంలోనే మరణించారు. వీరిలో ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్, రియాలిటీ షో స్టార్ జేడ్ గూఢీ, 'బాయ్ జోన్' బ్యాండ్ సిగర్ స్టిఫెన్ గ్యాట్లీ, 'క్లూలెస్' స్టార్ బ్రిటానీ ముర్ఫి, సింగర్ డేవ్ డీ, నటి నటాషా రిచర్డ్ సన్ లాంటి వారు ప్రముఖులు. కాగా ఈ ఏడాది వీరిలో ఎవరి మరణం ఎక్కువ మందిని కలచివేసింది అనే ప్రశ్నతో ఓ ఆన్ లైన్ సైట్ సర్వే నిర్వహించింది.
ఇందులో ఎక్కువ మంది మైఖేల్ జాక్సన్ కే ప్రథమ స్థానం వస్తుందని భావించారు, కానీ ఆశ్చర్యకరంగా ఈ పాప్ స్టార్ రెండవ స్థానంలో నిలిచాడు. ప్రథమ స్థానంలో రియాలిటీ షో స్టార్ జేడ్ గూఢీ నిలిచింది. గూఢీ భారతీయ ప్రజలకు సుపరిచయమే. బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో బాలీవుడ్ నటీమణి శిల్పాశెట్టి మీద వివాదాశ్పద వ్యాఖ్యలు చేసి ఆమె ఈ రియాలిటీ షోలో నెగ్గడానికి పరోక్షంగా సాయం చేసింది గూఢీ. కాగా ఆ తర్వాత ఎన్నో సార్లు ఈ విషయమై క్షమాపణలు చెప్పిన గూఢీ ఆ తర్వాత భారతదేశంలో జరుగుతున్న బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో పాల్గొనడానికి వచ్చి అనారోగ్యం కారణంగా మధ్యలోనే వైదొలిగింది. ఆ తర్వాత ఆమె అడ్వాన్స్ స్టేజీలో వున్న సెర్వికల్ క్యాన్సర్ తో బాధపడుతూ మార్చి 22 న మరణించింది. చనిపోవడానికి నెల క్రితమే ఈమె తన బాయ్ ఫ్రెండ్ జాక్ ను వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు.
ఆ తర్వాత మూడవ స్థానంలో ఫోక్ సింగర్ మరియు రచయిత జాన్ మార్టిన్ నిలిచాడు. ఈ తర్వాతి స్థానాల్లో సింగర్ డేవ్ డీ, నటి నటాషా రిచర్డ్ సన్, 'బాయ్ జోన్' బ్యాండ్ సిగర్ స్టిఫెన్ గ్యాట్లీ లు నిలిచారు.