Don't Miss!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'అవతార్'దర్శకుడు నెక్ట్స్ అన్నీ అవే...
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ మూడేళ్ల కిందట రూపొందించిన త్రీడీ చిత్రం'అవతార్'. ప్రపంచవ్యాప్యంగా రికార్డు కలెక్షన్స్ కురించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కొత్త రికార్డులను నెలకొల్పింది. అంత పెద్ద ఘన విజయం సాధించిన చిత్రం తర్వాత ఆ దర్శకుడు ఆ చిత్రంకి సీక్వెల్స్ ప్లాన్ చేయడా అన్న ప్రశ్న అందరిలో తలెత్తింది. దీనికి ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాధానమిచ్చారు.
''ఇక మీదట బయటి నిర్మాతల సినిమాల్ని చేయను. నా మిగతా సినీ కెరీర్ మొత్తం 'అవతార్' సీక్వెల్స్ తీయడానికే వినియోగిస్తా. 'అవతార్-2', 'అవతార్-3' ప్రస్తుతం నా మనసులో ఉన్నాయి. వీలైతే 'అవతార్-4' కూడా వచ్చే అవకాశం ఉంది''అని చెప్పారు. ఇక అవతార్ సినిమాలో చివరి వరకు ఏఏ క్యారెక్టర్స్ బ్రతికి ఉన్నాయో అవే క్యారెక్టర్స్ తిరిగి అవతార్ సీక్వెల్స్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు.
పండోరా గ్రహ నేపథ్యంలో సైన్స్-ఫిక్షన్ తరహా కథతో కళ్లు చెదిరే సాంకేతిక హంగులతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపు సినిమాల్ని తీయబోతున్నానని కామెరాన్ ప్రకటించారు. ఎంటర్టైన్మంట్ వీక్లీ వార్త కధనాల ప్రకారం జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాకి రెండు సీక్వెల్స్ని రూపోందించి 3డిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ ఈసీక్వెల్స్ని రూపోందించే పనిలో ఉన్నారు. అన్ని పూర్తి చేసి 2014, 2015లలో విడుదల చేయాడానికి సన్నాహాలు చేసుకుంటునట్లు సమాచారం. ఈసందర్బంలో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలాగైనా సరే అనుకున్న టైమ్కి పూర్తి చేసి క్రిస్ట్ మస్ 2014 లేక 2015న విడుదల చేయగలిగేటట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు.