Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మైఖేల్ మరణించినందుకు నాకేం బాధలేదు...!!
ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఈ సంవత్సరం జూన్ 25వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చెందడం పట్ల తనకు పెద్దగా బాధగా ఏమీ అనిపించలేదని అతని సోదరుడు, పాప్ సింగర్ జర్మెయిన్ జాక్సన్ అభిప్రాయపడ్డాడు. మైఖేల్ ను బ్రతికించడానికి అసలు ఏ దారీ లేకపోయినప్పుడు ఇక బాధపడి ఏం లాభం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
మైఖేల్ ఎంతో ఖరీదైన, ప్రమాదకరమయిన డ్రగ్స్ వాడుతూ, తన జీవితంతో ఆడుకుంటున్నాడని తెలిసి తమ కుటుంబ సభ్యలమంతా తనకి బాసటగా నిలవడానికి ముందుకొచ్చామని కానీ అప్పటికే జాక్సన్ ఆ డ్రగ్స్ కు బాగా అలవాటు పడిపోయాడని, తమ చెయ్యిదాటి పోయాడని తెలిసిందని తెలిపాడు. ఆ తర్వాత కూడా ఎంతో పవర్ ఫుల్ డ్రగ్స్ వాడినప్పటికీ అతన్ని కాపాడలేమని తెలిసిందని చెప్పాడు.
మరి అలాంటప్పుడు తన సోదరుడు బ్రతకడని తెలిసినప్పుడు, ఇక గిల్టీగా ఫీలవ్వడం ఎందుకని ఆయన అభిప్రాయపడ్డాడు. మితిమీరిన డ్రగ్స్ తో మైఖేల్ తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడని అభిప్రాయపడ్డాడు. కాగా మైఖేల్ సోదరులంతా కలసి ప్రపంచ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించారు.