Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మాజీ భార్య మీద రూ. 370 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరో!
ప్రముఖ హాలీవుడ్ నటుడు, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ సిరీస్ స్టార్ జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హియర్డ్ను శారీరకంగా, మానసికంగా వేధించినట్లు 2016లో ఆరోపణలు వచ్చినప్పుడు అభిమానులంతా షాకయ్యారు. ఈ కేసు కారణంగానే అతడి సినిమా కెరీర్ కూడా ప్రభావితం అయింది. మహిళను వేధించిన కారణంగా డిస్నీ సంస్థ భారీ చిత్రం నుంచి అతడిని తప్పించిన సంగతి తెలిసిందే.
జానీ డెప్, అంబర్ హియర్డ్ మధ్య పొసగక పోవడంతో 2016లోనే వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా... జానీ డెప్ ఎలాంటి వ్యక్తో, తనపై ఏయే సందర్భాల్లో దాడి చేసి గాయపరిచాడో వెల్లడిస్తూ అంబర్ హియర్డ్ 2019 జనవరిలో కోర్టుకు సమర్పించిన పత్రాలు కొన్ని బయటకు లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేశాయి.
ఖండిస్తూ వచ్చిన జానీ డెప్
అంబర్ హియర్డ్ తన భర్త చేతిలో తీవ్ర హింసకు గురైందనే వార్తలకు సరిపడా కొన్ని సాక్ష్యాలు కూడా మీడియాలో సర్క్యులేట్ కావడంతో ఆమెకు అభిమానుల నుంచి కూడా మద్దతు లభించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను జానీ డెప్ ఖండిస్తూ వచ్చారు.
రూ. 370 కోట్ల పరువు నష్టం
మూడేళ్ల తర్వాత జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ మీద తాజాగా 50 మిలియన్ డాలర్ల(రూ. 347 కోట్లు) పరువు నష్టం కేసు వేశాడు. ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని, తనపై అంబర్ దాడి కూడా చేసిందంటూ ఆధారాలతో సహా కేసు పెట్టాడు.
ప్రియుడితో బ్రేకప్?.. శృతిహాసన్ డేరింగ్ నిర్ణయం.. అంతా మంచే.. వైరల్గా ట్వీట్
జానీ డెప్ లా సూట్లో పేర్కొన్న వివరాలు ఇవే
అంబర్ హియర్డ్ తనపై దాడి చేసిందని, తన వేలిని కత్తించిందని తన లా సూట్లో జానీ డెప్ ఆరోపించారు. వోడ్కా బాటిల్ విసరడంతో తన వేలికి తీవ్రగాయం అయిందని, ఎముక విరిగినట్లు తెలిపారు. బెడ్ మీద ఉన్నపుడు తనపై పిడిగుద్దులతో దాడి చసినట్లు పేర్కొన్నారు.
మే 2016లో సంఘటన
మే 2016లో ఈ సంఘటన చోటు చేసుకుందని, ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని జానీ డెప్ వాదిస్తున్నారు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా సమర్పించాడు. మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.