Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బోస్నియా పౌరసత్వాన్ని అందుకోనున్న సూపర్స్టార్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ బోస్నియా గౌరవ పౌరసత్వాన్ని అందుకుంది. ఇటీవల ఏంజిలీనా జోలీ దర్శకత్వ పర్యవేక్షణలో 'ఇన్ ద ల్యాండ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా విడుదల చేసి అక్కడి ప్రజల మన్ననలను పొందిన విషయం తెలిసిందే. ఏంజిలీనా జోలీకి ఈ గౌరవాన్ని మే 3వ తారీఖున బోస్నియా రాజధాని 'సారజీవో' లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫంక్షన్ ఇవ్వనున్నట్లు బోస్నియా ప్రతినిధులు తెలిపారు.
1990లో జరిగిన యథార్ద గాథ ఆధారంగా ఏంజిలీనా జోలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో యుద్ద సమయంలో అలనాడు జరిగిన సంఘటలను కళ్లకు కళ్లినట్లు చూపించారు. అంతేకాకుండా ఓ సెర్బియన్ సోల్జర్, బోస్నియా మహిళ మధ్య చూపించిన రొమాన్స్ ఈ సినిమాకి హైలెట్గా నిలిచింది.
వీటితో పాటు సారజేవో, బోస్నియా, హెర్జ్గొవీనియాలో యద్దం గురించి కొన్ని అక్షర సత్యాలను ఈతరం ప్రపంచానికి చూపడంలో ఏంజిలీనా జోలీ చూపిన సహాకారం గుర్తించిన ప్రభుత్వ అధికారులు ఏంజలీనా జోలీకి బోస్నియా పౌర సత్వాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. 'ఇన్ ద ల్యాండ్ బ్లడ్ అండ్ హానీ' సినిమాలో వివిధ మత మరియు సాంస్కృతిక నేపథ్యాల సయోధ్య సూత్రాలతో పాటు మానవత్వం, ప్రజాస్వామ్యం, సహనము చూపించిన తీరు అమోఘంగా వర్ణించారు.
ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న హాలీవుడ్ సూపర్ జంట బ్రాడ్పిట్(48), ఏంజెలినా జోలీ(36) త్వరలో ఒక ఇంటి వారుకానున్నారు. ఇటీవలే వారి నిశ్చితార్థం అయినట్లు అధికారకంగా వెల్లడైంది. జోలీ కోసం ఆమె ప్రియుడు బ్రాడ్ పిట్ ఓ వజ్రపుటుంగరం తయారుచేయించడంతో ఈ విషయం బయటకొచ్చింది. పెళ్లి కోసం బ్రాడ్ 2.50 లక్షల డాలర్ల విలువైన వజ్రపుటుంగరం చేయించినట్లు బెవర్లీ హిల్స్ జ్యూయలర్ రాబర్ట్ ప్రొకాప్ వెల్లడించారు.
అనంతరం పిట్ అధికార ప్రతినిధి సింతియా పెట్-దంతే ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. 'అవును అది నిజమే. భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ నిర్ణయం పట్ల వారి పిల్లలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతానికి వారి పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఆమె తెలిపారు.