Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారతదేశంలో సాంప్రదాయ పద్దతిలో పెళ్శికి సిధ్ధమైన హాలీవుడ్ సూపర్ సింగర్...
భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఇండియా సాంప్రదాయాలతో పెళ్శిచేసుకోవాలన్నది నాకోరిక అని అన్నారు కాటిపెర్రి. కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ఇద్దరూ ఇండియా సాంప్రదాయంతో పెళ్శిచేసుకోబోతున్న విషయం అందరికి తెలిసిందే, దానికి గాను బుధవారం వారు స్పెషల్ జెట్ లో ఇండియాకి రావడం జరిగింది. ముంబయి ఎయిర్ పోర్టులో దిగినటువంటి కాటి పెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ఇద్దరూ జైపూర్ వెళ్శడానికి ప్లయిట్ కోసం వేచిఉన్నారు. అలాంటి సమయంలో అభిమానుల తాకిడికి తట్టుకోవడానికి కాటిపెర్రి ఎవ్వరికి కనిపించకుండా ఇంటియన్ ట్రెడిషినల్ గోంగళిని ధరించి కనిపించకుండా మానేజ్ చేశారంట. తర్వాత జైపూర్ చేరుకున్న ఈ జంట మూడు గంటల పాటు ప్రయాణం చేసి లగ్జరి అమన్ ఐ కాస్ రిసార్ట్స్ చేరుకోవడం జరిగింది. కొన్ని గంటల సమయంలోనే వారితో పాటు కాటిపెర్రి తల్లిదండ్రులు కెయిత్ మరియు మేరి హుడ్సన్ అక్కడుకు చేరుకోవడం జరిగింది. వీరి అందరికోసం నిద్రపోవడానికి టెంట్స్ ని ఏరెంజ్ చేయడం జరిగింది. రోజుకి ఈటెంట్స్ కిగాను 600పౌండ్లు చెల్లిస్తున్నామని వారన్నారు.
ఇక కాటిపెర్రి స్నేహితురాలు రిహానా మరియు సెలబ్రిటీస్ డేవిడ్ వాలియన్స్, జోనత్తాన్ రోస్ మొన్ననే ఇక్కడికి రావడం జరిగింది. ఇక వివరాలలోకి వెళితే కాటి పెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ పెళ్శిచేయడానికి గాను మాంటి హిందు పురోహితుడుని చూడమని వారు ఆదేశించడం జరిగిందన్నారు. పెళ్శి కూడా అంతా హిందూ సాంప్రదాయంలోనే జరగాలని అన్నట్టు సమాచారం. ఈ పెళ్శిని నాలుగు రోజుల పాటు నిర్మహించనున్నామని, ఇందులో టైగర్ సఫారి కూడా ఉంటుందని అన్నారు. రస్సెల్ కాటిపెర్రితో పెళ్సిని జైపూర్ లోని రాంబాగ్ ప్యాలెస్ లో చేద్దామని చెప్పినట్లు దానికి కాటిపెర్రి రాంబాగ్ ప్యాలెస్ కంటే కూడా రిసార్ట్ లో ఐతేనే బాగుటుందని అన్నట్లు వినికిడి. ఇక పోతే వీరి పెళ్శికి సంబంధించినటువంటి పెళ్శిపోటోలకు మీడియాని దూరంగా ఉంచిన విషయం అందరికి తెలిసిందే. ఎట్టకేలకు మన ఇండియా సాంప్రదాయాలను మనం గౌరవించక పోయిన విదేశీయులు బాగా ఫాలోఅవుతున్నారన్నమాట.