మైఖేల్ జాక్సన్ మరణించి 11 ఏళ్లయినా.. ఇంకా ఆ అనుమానాలు చావలేదు!
కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. నేడు ఆ దిగ్గజ పాప్ సింగర్ తుది శ్వాసను విడిచిన రోజు. మైకేల్ జాక్సన్ ప్రాణాలు విడిచి 11 ఏళ్లవుతున్నా ఇంకా ఆయన ఊహలు మాత్రం ఎవరు మరువలేదు. నిత్యం మైకేల్ పాటలతో స్మరించుకుంటూనే ఉంటున్నారు. ఇక నేడు వర్థంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు.
నాలుగు దశాబ్దాల పాటు మైఖేల్ జాక్సన్ తన పాటలతో ప్రపంచాన్ని ఒక ఊపు ఉపేశాడు. సోషల్ మీడియా కూడా లేని సమయంలో ఆయనకు సంబంధించిన వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యేవి. కింగ్ ఆఫ్ పాప్ అనే బ్రాండ్ ఆయనకు చెరగని గుర్తింపు. చరిత్రలో నిలిచిపోయేలా అందరి మనసుల్ని ఆకట్టుకున్నారు. మైఖేల్ జాక్సన్ కేవలం పాటలతోనే కాకుండా తన మూన్ వాక్ డ్యాన్స్ తో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు.

పాటలు పడుతూనే అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకున్న మొదటి సింగర్ మైఖేల్ జాక్సన్. అయితే మైకేల్ మరణించి 11 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆయన మృతిపై అనేక రకాల అనుమానాలు వస్తూనే ఉన్నాయి. నిద్రపోవడం కోసం అధిక మోతాదులో వివిధ రకాల మాత్రలు తీసుకోవడం వలన గుండెపోటుతో మరణించాడని అప్పటి వైద్యులు వివరణ ఇచ్చినప్పటికి కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు మైఖేల్ జాక్సన్ వర్ధంతి సందర్భంగా వివిధ దేశాల్లో ఉన్న ఆయన అభిమానులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











