Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
శీలాన్ని వేలం వేసిన భామకు ఇండియాలో నో ఎంట్రీ
గతంలో హైతీలో భూకంప బాధితులకు సహాయం చేయడానికి తన శీలాన్ని వేలం వేస్తున్నట్టు ప్రకటించిన హాలీవుడ్ వివాదాల రాణి లిండ్సే లోహన్ ను భారతదేశంలో పర్యటించకుండా నిషేధించాలని భారతీయ ఇమిగ్రేషన్ అధికారులు యోచిస్తున్నారు. గత డిసెంబరులో పర్యాటక వీసా మీద భారత్ విచ్చేసిన లిండ్సే లోహన్ బిబిసి సంస్థ వారు మనుషుల అక్రమ రవాణా మీద నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొంది. అంతటితో ఆగకుండా తాను భారతదేశ వీసా నిబంధనలను ఉల్లంఘించానని, పర్యాటక వీసా మీద వచ్చి మిగతా పనుల కోసం దేశంలో తిరిగినట్టు, ఈ పనిలో భాగంగా తను 40 మంది పిల్లలను కాపాడినట్టు ఆవిడ గారు ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఎక్కడపడితే అక్కడ ప్రచారం చేసుకుంటోంది.
దీంతో ఒళ్లు మండిన ఇమిగ్రేషన్ వారు ఆమె పేరును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని యోచిస్తున్నారట. ఇక ఆమె 40 మంది పిల్లలను రక్షించినట్టు అసత్య ప్రచారాలు చేసుకుంటోందని..ఆమె రాకముందే వారిని రక్షించామని భారత్ లోని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.