Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అసలు సంగతి పెరుమాళ్లకే ఎరుక..!?
మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడటంలేదు సరికదా ఇంకా బిగుసుకుంటోంది. రోజుకో కొత్త అనుమానాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైఖేల్ జాక్సన్ చనిపోయాడని డా ముర్రే నిర్ధారించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన మైఖేల్ కు ఆసుపత్రిలో కూడా గుండె కొట్టుకుందట. కానీ ముందుగానే మైఖేల్ జాక్సన్ చనిపోయాడని తెలిపి చికిత్సను ఆపేయడే కాకుండా, ఆంబులెన్స్ ను పిలవడంతో అలసత్వం ప్రదర్శించి కావాలనే ఆయన మృతికి కారకుడయిన డా ముర్రేను శిక్షించాలని మైఖేల్ తండ్రి జియో జాక్సన్ కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఇదిలా వుంటే ముర్రే మైఖేల్ జాక్సన్ కు CPR చేయడం మధ్యలో ఆపేసి అక్కడున్న మందు సీసాలను ఎవ్వరికీ కనబడకుండా దాచేయాలని ప్రయత్నించడమే కాకుండా ఆంబులెన్స్ ను పిలవడంలో ఆలస్యం చేసాడని పోలీసులకు నివేదించిన మైఖేల్ బాడీ గర్డ్ ను మైఖేల్ కుటుంబ సభ్యులు ఉద్యోగం నుండీ తొలగించారు. మరిందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. అసలు ఈ కేసు చిక్కుముడి ఎప్పుడు వీడనుందో మరి..!?