twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైఖేల్ చేతి తొడుగు 31 లక్షలు!!

    By Kuladeep
    |

    పాప్ రారాజు దివంగత మైఖేల్ జాక్సన్ కు ఉన్న అభిమానులు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మైమరపించే స్టెప్పులతో అందరి హృదయాలనూ దోచుకున్న ఈ పాప్ స్టార్ తన మరణంలో అందరినీ వదలి వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు, పాటలు ఇప్పటికీ అంతటా మారుమోగుతూనే వున్నాయి. ఆయన వస్తువులను వేలం వెసి మరీ అమ్ముతున్నారు. మొన్న ఆయన మరణదృవీకరణ పత్రాన్ని అమ్మకానికి పెట్టగా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

    ఈ విధంగా పాప్‌ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ వాడిన వస్తువులను ఆయన అభిమానులు లక్షల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంటూ, జాక్సన్‌ పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా లాస్‌ ఏంజల్స్ లో జరిగిన ఓ వేలంలో మైఖేల్‌ వాడిన చేతి తొడుగు (గ్లోవ్‌) ను రూ.31 లక్షకు ఓ అభిమాని సొంతం చేసుకున్నారు. ఇది జాక్సన్‌ స్మారకాల్లో అత్యంత విలువైందని 'ఫిమేల్‌ ఫస్ట్‌ ఆన్‌లైన్‌' తెలిపింది. 1984లో మైఖేల్‌ దీన్ని ధరించారని పేర్కొంది. ఇంకా పలు వస్తువులను కూడా వేలానికి ఉంచారు. 1971 టీవీ షోలో మైఖేల్‌ ధరించిన ఓ షర్ట్‌ రూ.8 లక్షలు, 1981 అమెరికా సంగీత అవార్డుల సందర్భంలో ఆయన వేసుకున్న స్వెట్టర్‌ రూ.21 లక్షలు పలికింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X