Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మైఖేల్ చేతి తొడుగు 31 లక్షలు!!
పాప్ రారాజు దివంగత మైఖేల్ జాక్సన్ కు ఉన్న అభిమానులు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మైమరపించే స్టెప్పులతో అందరి హృదయాలనూ దోచుకున్న ఈ పాప్ స్టార్ తన మరణంలో అందరినీ వదలి వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు, పాటలు ఇప్పటికీ అంతటా మారుమోగుతూనే వున్నాయి. ఆయన వస్తువులను వేలం వెసి మరీ అమ్ముతున్నారు. మొన్న ఆయన మరణదృవీకరణ పత్రాన్ని అమ్మకానికి పెట్టగా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
ఈ విధంగా పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ వాడిన వస్తువులను ఆయన అభిమానులు లక్షల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంటూ, జాక్సన్ పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా లాస్ ఏంజల్స్ లో జరిగిన ఓ వేలంలో మైఖేల్ వాడిన చేతి తొడుగు (గ్లోవ్) ను రూ.31 లక్షకు ఓ అభిమాని సొంతం చేసుకున్నారు. ఇది జాక్సన్ స్మారకాల్లో అత్యంత విలువైందని 'ఫిమేల్ ఫస్ట్ ఆన్లైన్' తెలిపింది. 1984లో మైఖేల్ దీన్ని ధరించారని పేర్కొంది. ఇంకా పలు వస్తువులను కూడా వేలానికి ఉంచారు. 1971 టీవీ షోలో మైఖేల్ ధరించిన ఓ షర్ట్ రూ.8 లక్షలు, 1981 అమెరికా సంగీత అవార్డుల సందర్భంలో ఆయన వేసుకున్న స్వెట్టర్ రూ.21 లక్షలు పలికింది.