Don't Miss!
- News గన్నవరం వైసీపీపై తాజా నివేదిక..వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే..?
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఈ సారీ మొదటి స్థానం మైఖేల్ జాక్సన్దే
న్యూ యార్క్ : చనిపోయి ఐదేళ్లు గడచినా పాప్స్టార్ మైఖేల్ జాక్సన్ ఆదాయం చెక్కుచెదరలేదు. ఆయన ఎస్టేట్, ఆల్బమ్లతో ఇప్పటికీ 141 మిలియన్ డాలర్ల వార్షిక రాబడి వస్తోంది. ఫలితంగా ఫోర్బ్స్ కీర్తిశేషులైన సెలెబ్రిటీల జాబితాలో వరుసగా రెండోసారీ ఆయనే అగ్రస్థానంలో నిలిచారు.
2013లో కూడా మొదటి స్థానం ఈయనకే దక్కింది. ఫోర్బ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండో స్థానంలో గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ ఉన్నాడు. 1977లో చనిపోయిన ఆయన పేరుమీద ఇప్పటికీ 55 మిలియన్ డాలర్ల సంపాదన వస్తోంది.
మూడో స్థానంలో కార్టూనిస్ట్, పీనట్ కామిక్ సృష్టికర్త ఛార్లెస్ షుల్జ్ ఉన్నారు. ఆయన పేరున 40 మిలియన్ డాలర్ల రాబడి వస్తోంది. ఈ వార్త విన్న మైకల్ జాక్సన్ అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఆ విషయాన్ని పోస్ట్ తమ ఆరాధ్య దైవాన్ని మరోసారి స్మరించుకుంటున్నారు.