Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాకు నచ్చినట్టు నేనుంటా..!! అభిమానలతో నాకేం పని..!!
అమెరికాకు చెందిన సింగర్, నటి, డిన్నీ టివీ వారి 'హన్నామొంతన' కార్యక్రమంతో పాపులర్ అయిన మిలే సరస్ ఇటీవల అన్నీ వివాదాశ్పద విషయాలతోనే పాపులర్ కావాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్నటికి మొన్న హాలీవుడ్ స్టార్ నటీమణి ఏంజలీనా జోలీ, మడోన్నాలు తమ పిల్లల్ని వారి అనుమతి లేకుండా మీడియా ముందుకు తీసుకువచ్చి వారి పబ్లిసిటీ కోసం తమ పిల్లల్ని ఉపయోగించుకుంటున్నారని ఆక్షేపించి, ఆ తర్వాత నీ సంగతేంటి నీవు కూడా పిన్న వయసులోనే మీడియా ముందుకు వచ్చావు కదా.. ఇలాంటి దిక్కుమాలిన విమర్శలు మానుకో అని హాలీవుడ్ మొత్తం ఎదురుప్రశ్నించే సరికి నాలుక్కరచుకుంది.
ఇప్పుడు మరో సారి వివాదాశ్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది మిలే. తనను చూసి తమ పిల్లలు చెడిపోతున్నారని అమెరికాలో ఆమె మీద విమర్శలు పెల్లుబుకుతుంటే, నిన్న మొన్నటి వరకూ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో నేను అందరికంటే ముందుంటాను అని గొప్పలు పోయి మిగిలిన వారిని విమర్శించిన మిలే ఇప్పుడు మాట మార్చింది. మీ పిల్లలను మీరే దారిలో పెట్టుకోండి. అది చేత కాక నా మీద పడి ఏడుస్తారు ఎందుకు...?? అయినా మీ పిల్లల గురించి ఆలోచించడానికి నేనేమన్నా వారి తల్లినా మీ పిల్లల్ని మీరే దారిలో పెట్టుకోండని ఎదురుదాడి చేస్తోంది. అవును మరి ఇతరులకు నీతులు చెప్పడం సులువే కానీ ఆచరించడం ఎంత కష్టమో ఆమెకు ఇప్పుడు బోధపడి వుంటుంది.