Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
జేమ్స్ బాండ్ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. అఫీషియల్ స్టేట్మెంట్
సాధారణంగా జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఆడియన్స్ జేమ్స్ బాండ్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి జేమ్స్ బాండ్ చిత్రాన్ని కూడా వదలలేదు కరోనా భూతం.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ బాగా విస్తరించి ఇప్పటికే వేలాది మంది మరణించారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తూ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు.
దీంతో ఈ పరిస్థితుల్లో తమ సినిమాను విడుదల చేయకూడదని డిసైడ్ అవుతున్నారు ఇంటర్నేషనల్ సినీ నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే జేమ్స్ బాండ్ తాజా సినిమా 'నో టైమ్ టు డై' సినిమా విడుదలను వాయిదా వేశారు. చిత్ర విడుదలను ఏప్రిల్ 8వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అంటే దాదాపు 7 నెలలపాటు వాయిదా వేశారన్నమాట.
జేమ్స్ బాండ్ చిత్రాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంటుంది. సో.. ఏప్రిల్ 8న జేమ్స్ బాండ్ 'నో టైమ్ టు డై' విడుదల చేయాలనుకున్న చిత్రయూనిట్ ఈ మేరకు ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. కానీ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సినిమాను నవంబర్ నెలకి వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు ఆ చిత్ర నిర్మాతలు.