షాక్: హీరోయిన్ ప్రియాంక చోప్రా అడ్డాలో వ్యభిచారం
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెకు సంబంధించిన ప్రాపర్టీ(బిల్డింగ్)లో సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. ఈ సంఘటన అటు పోలీసులను, ఇటు ఆమె అభిమానులను కూడా నిర్ఘాంత పోయేలా చేసింది. ఆమెకు సంబంధించిన సదరు బిల్డింగును వేరే వ్యక్తులు లీజు తీసుకుని అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.
ఇటీవల ముంబైలోని వెర్సోవాలో ఓ స్పాలో గుట్టుగా నడుస్తున్న సెక్స్ రాకెట్ పోలీసులు రట్టు చేసారు. విటులతో పాటు పలవురు ప్రాసిట్యూట్లను అరెస్టు చేసారు. ఈ సంఘటన వెలుగు చూసే వరకు ప్రియాంక చోప్రాకు గానీ, ఆమె కుటుంబీలకు గానీ ఈ భాగోతం గురించి తెలియదని పోలీసులు చెప్పుకొచ్చారు.

పోలీసులు రైడ్ చేసిన సమయంలో ముగ్గురు మహిళలు, మేనేజర్ దొరికారు. అయితే స్పా ఓనర్ మాత్రం పరారీలో ఉన్నట్లు తేలింది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. స్పా ఓనర్ ప్రియాంక కుటుంబీలను నమ్మించి మోసం చేసి...స్పా ముసుగులో ఇలాంటి అసంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో స్పా ఓపెనింగ్ సమయంలో ప్రియాంక మదర్, బదర్ కూడా హాజరయ్యారు.
ఈ సంఘటనతో ప్రియాంక చోప్రా చాలా డిస్ట్రబ్ అయిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తనకు సంబంధించిన ప్రాపర్టీలో ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకోవడాన్ని ఆమె జీనిర్ణించుకోలేక పోతోందని అంటున్నారు. ఏది ఏమైనా ఇకపై ప్రియాంక చోప్రా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











