Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చెన్నై ప్రజల నీటి కష్టాలు చూసిన చలించిపోయిన హాలీవుడ్ హీరో
తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్న చెన్నై నగరం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. నగర ప్రజలకు ఇతర ప్రాంతాల నుంచి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చెన్నైలో వర్షాలు లేక పోవడంతో తాగునీటి వనరులు ఎండిపోయాయి. నగరం చుట్టు పక్కల చాలా చోట్ల చెరువులు, కుంటలను పూడ్చి భవనాలు నిర్మించడం కూడా ఇలాంటి పరిస్థితి కారణం.
చెన్నై నగర వాసుల కష్టాలపై హాలీవుడ్ నటుడు, టైటానిక్ మూవీ స్టార్ లియోనార్డో డికాప్రియో స్పందించారు. ఎండిపోయిన భావి నుంచి నీటిని తోడుకుంటున్న ఫోటో తన ఇన్స్టా గ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసిన ఆయన... ఈ పరిస్థితి నుంచి చెన్నై నగరం బయటపడాలంటే వర్షాలు పడటం ఒక్కటే మార్గమని తెలిపారు.
సౌతిండియాలోని చెన్నై నగరం నీరు లేక అల్లాడుతోంది. ఈ బావి పూర్తిగా ఖాళీ అయింది. నగరానికి తాగునీరు అందించే నాలుగు ప్రధాన వనరులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని పట్టుకోవడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. నీరు లేక పోవడంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. నీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వర్షం పడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చెన్నై ప్రజలు వర్షం కోసం ప్రార్థనలు చేయాలి అంటూ లియోనార్డో డికాప్రియో వ్యాఖ్యానించారు.
అంతే కాదు భారత్లో రోజు రోజుకు పెరిగిపోతున్న చెత్త సమస్యపై కూడా ఇటీవల లియోనార్డో డికాప్రియో స్పందించారు. ఇండియాలో ఓ డంపింగ్ యార్డ్లో 65 మీటర్ల ఎత్తులో చెత్త పేరుకుపోయిందని, ప్రతి సంవత్సరం ఇది 10 మీటర్ల ఎత్తు పెరుగుతోందని, త్వరలోనే తాజ్ మహల్ ఎత్తును కూడా ఇది అధిగమిస్తుందని తెలిపారు.