Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆస్కార్ వేడుకల్లో మార్పు... కారణం అదే!
సినీ రంగంలో అత్యున్నత అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డును చేతుల్లోకి తీసుకోవానే కల అందరూ కంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. ఆస్కార్ అవార్డును గెలవాలని అంరదూ ట్రై చేస్తారు. మన ఇండియన్ సినిమాలు కూడా ఆస్కార్ కోసం బరిలోకి దిగుతాయి. కానీ అక్కడి వరకు చేరలేదు. చివరగా మనకు ఆస్కార్ అవార్డును తీసుకొచ్చిన ఘనత ఏ ఆర్ రెహమాన్కు దక్కుతుంది.
ఒకటి కాదు ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను ఇండియాకు తీసుకొచ్చి చరిత్ర లిఖించాడు. అయితే ఈ ఆస్కార్ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. లాస్ ఏంజిల్స్లోని డాల్బి థియేటర్లో ఆస్కార్ అవార్డు వేడుకల అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం అలా జరగదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది.
సినిమా రంగమంతా మూతపడింది. ఎన్నో చిత్రాలు ఇంకా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇంకా ఏవైనా చిత్రాలు ఎంట్రీలోకి వస్తాయా? అని చూసేందుకు ఆస్కార్ వేడుకలను వాయిదా వేసి ఏప్రిల్లో జరుపనున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు కరోనా కూడా తగ్గే అవకాశం ఉందని అలా ఫిక్స్ చేశారట. ఇక ఈ 93వ ఆస్కార్ అవార్డుల రేసులోకి మన భారత చిత్రం జల్లికట్టు ఎంట్రీ ఇచ్చింది. మరి చివరకు నిలబడి అవార్డును గెలుస్తుందో లేదో చూడాలి.