Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆస్కార్ వేడుకల్లో మార్పు... కారణం అదే!
సినీ రంగంలో అత్యున్నత అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డును చేతుల్లోకి తీసుకోవానే కల అందరూ కంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. ఆస్కార్ అవార్డును గెలవాలని అంరదూ ట్రై చేస్తారు. మన ఇండియన్ సినిమాలు కూడా ఆస్కార్ కోసం బరిలోకి దిగుతాయి. కానీ అక్కడి వరకు చేరలేదు. చివరగా మనకు ఆస్కార్ అవార్డును తీసుకొచ్చిన ఘనత ఏ ఆర్ రెహమాన్కు దక్కుతుంది.
ఒకటి కాదు ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను ఇండియాకు తీసుకొచ్చి చరిత్ర లిఖించాడు. అయితే ఈ ఆస్కార్ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. లాస్ ఏంజిల్స్లోని డాల్బి థియేటర్లో ఆస్కార్ అవార్డు వేడుకల అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం అలా జరగదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది.
సినిమా రంగమంతా మూతపడింది. ఎన్నో చిత్రాలు ఇంకా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇంకా ఏవైనా చిత్రాలు ఎంట్రీలోకి వస్తాయా? అని చూసేందుకు ఆస్కార్ వేడుకలను వాయిదా వేసి ఏప్రిల్లో జరుపనున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు కరోనా కూడా తగ్గే అవకాశం ఉందని అలా ఫిక్స్ చేశారట. ఇక ఈ 93వ ఆస్కార్ అవార్డుల రేసులోకి మన భారత చిత్రం జల్లికట్టు ఎంట్రీ ఇచ్చింది. మరి చివరకు నిలబడి అవార్డును గెలుస్తుందో లేదో చూడాలి.