ఫ్యాన్స్ హాపీ: రంగంలోకి మైఖేల్ జాక్సన్ వారసుడు
లాస్ ఏంజిల్స్: పాప్ మ్యూజిక్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణం తర్వాత ఆయన అఖండ అభిమాన లోకం విషాదంలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. మైఖేల్ మరణించి ఏళ్లు దాటినా ఆయన జ్ఞాపకాలను అభిమానులు మరిచిపోలేక పోతున్నారు. కానీ తాజాగా ఓ విషయం ఫ్యాన్స్ను ఆనందంలో ముంచెత్తింది.

మైఖేల్ జాక్సన్ వారసుడు...ప్రిన్స్ సంగీత ప్రపంచ రంగంలోకి దిగాడు. త్వరలో ఓ మ్యూజిక్ ఆల్బం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పాప్ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సింగర్ జస్టిన్ బీబర్తో కలిసి ప్రిన్స్ ఓ మ్యూజిక్ ఆల్బం చేస్తున్నట్లు తెలుస్తోంది.
జాక్సన్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 17 ఏళ్ల ప్రిన్స్, 20 ఏళ్ల బీబర్ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బం రూపొందించే పనిలో ఉన్నారు అని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇంతకు మించిన వివరాలు ఏమీ తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











