twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్టోబర్‌లో మా పెళ్శి వేడుకని ఘనంగా జరుపుకుంటాం: కాటి పెర్రి

    By Nageswara Rao
    |

    భారతదేశ సాంప్రదాయాలు నచ్చి భారతదేశం వచ్చి మరీ పెళ్శి చేసుకున్న జంట రస్సెల్ బ్రాండ్, సింగర్ కాటి పెర్రి. ఈ మద్య కాలంలో కమెడియన్ రస్సెల్ బ్రాండ్, సింగర్ కాటి పెర్రి ఇద్దరూ బిజిగా టూర్స్ లో ఉండడం వల్ల కలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రస్సెల్ బ్రాండ్ రాక్ ఆఫ్ ఏజెస్ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే రస్సెల్ బ్రాండ్ షూటింగ్‌లో ఉండడం వల్ల ఎక్కువ సమయం ఇక్కడే గడపడంతో కాటి పెర్రికి దూరంగా ఉంటున్నారనేది నిజం. బ్రెజిల్‌లో ఉన్నప్పుడు సెప్టెంబర్‌లో కేవలం నాలుగు రోజులు మాత్రమే కలసి ఉండడం జరిగింది.

    జూన్ 18వ తారీఖున తన స్నేహితుడు నోల్ గాల్లాగర్ పెళ్శికి కూడా రస్సెల్ బ్రాండ్ సింగిల్‌గా హాజరవ్వడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా జరగడానికి కారణం కాటి పెర్రి సింగర్ కావడంతో పాటు ప్రస్తుతం ఆమె తన కొత్త ఆల్బమ్స్ మీద దృష్టి పెట్టి టూర్‌లో ఉండడమేనని అంటున్నారు. ఏది ఐతేనేం వచ్చే అక్టోబర్‌లో రస్సెల్ బ్రాండ్, కాటి పెర్రి ఇద్దరూ కలసి లండన్ వారి యొక్క మొట్టమొదటి మ్యారేజి వేడుకను జరుపుకోనున్నట్లు డైలీ మెయిల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో కాటి పెర్రి వెల్లిడించింది.

    English summary
    Comedian Russell Brand's wife singer Katy Perry is busy planning more tour dates, but he has reportedly spent his time with a blonde in Miami on Wednesday, June 22.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X