Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అక్టోబర్లో మా పెళ్శి వేడుకని ఘనంగా జరుపుకుంటాం: కాటి పెర్రి
భారతదేశ సాంప్రదాయాలు నచ్చి భారతదేశం వచ్చి మరీ పెళ్శి చేసుకున్న జంట రస్సెల్ బ్రాండ్, సింగర్ కాటి పెర్రి. ఈ మద్య కాలంలో కమెడియన్ రస్సెల్ బ్రాండ్, సింగర్ కాటి పెర్రి ఇద్దరూ బిజిగా టూర్స్ లో ఉండడం వల్ల కలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రస్సెల్ బ్రాండ్ రాక్ ఆఫ్ ఏజెస్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే రస్సెల్ బ్రాండ్ షూటింగ్లో ఉండడం వల్ల ఎక్కువ సమయం ఇక్కడే గడపడంతో కాటి పెర్రికి దూరంగా ఉంటున్నారనేది నిజం. బ్రెజిల్లో ఉన్నప్పుడు సెప్టెంబర్లో కేవలం నాలుగు రోజులు మాత్రమే కలసి ఉండడం జరిగింది.
జూన్ 18వ తారీఖున తన స్నేహితుడు నోల్ గాల్లాగర్ పెళ్శికి కూడా రస్సెల్ బ్రాండ్ సింగిల్గా హాజరవ్వడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా జరగడానికి కారణం కాటి పెర్రి సింగర్ కావడంతో పాటు ప్రస్తుతం ఆమె తన కొత్త ఆల్బమ్స్ మీద దృష్టి పెట్టి టూర్లో ఉండడమేనని అంటున్నారు. ఏది ఐతేనేం వచ్చే అక్టోబర్లో రస్సెల్ బ్రాండ్, కాటి పెర్రి ఇద్దరూ కలసి లండన్ వారి యొక్క మొట్టమొదటి మ్యారేజి వేడుకను జరుపుకోనున్నట్లు డైలీ మెయిల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో కాటి పెర్రి వెల్లిడించింది.