Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బ్యాంకాక్ లో ‘జగన్’
శాఖమూరి మల్లిఖార్జునరావు సూపర్ స్టార్ కృష్ణ బంధువు. ఈ చిత్రంలో ఆయన తనయుడు శివ హీరోగా నటిస్తున్నాడు. జగన్ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి ఈచిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయాలపెై ఇందులో ఎలాంటి చర్చ ఉండదని కేవలం కథాపరంగా ఈ చిత్రానికి ఆ టైటిల్ కరెక్ట్గా సూట్ అవుతుందని పెట్టాం తప్ప వేరే ఉద్దేశం లేదని నిర్మాత శాఖమూరి మల్లిఖార్జునరావు తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ...ఇందులో హీరో పేరు 'జగన్', జైళుకు వెళ్ళినతను ఎలా 'నిర్ధోషి'గా బయటకు వచ్చాడన్నదే చిత్ర కథ అని తెలిపారు. కృష్ణగారి సూపర్హిట్ సినిమా 'ఖైది రుద్రయ్య' సినిమాలోని 'పువ్వెత్తి కొట్టమాకు పురుషోత్తమా' అనే పాటను రీమిక్స్ సాంగ్గా తీయడం జరుగుతోందని పేర్కొన్నారు. 5 పాటల చిత్రీకరణ, థాయ్లాండ్ మలేషియాలో 20రోజులపాటు చేశామని, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి, ఆడియోను, చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
శృతిరెడ్డి, దీపాలిసింగ్, ప్రసాద్బాబు, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, సత్యంరాజేష్, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయరామ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: వందేమాతరం, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వెంకన్నబాబు యేపుగంటి.