Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్టార్ హీరోయిన్ మరణం..ఆస్ది కోసం దెబ్బలాటలు
హాలీవుడ్ క్లియోపాత్రా ఎలిజిబుత్ టేలర్ రీసెంట్ గా స్వర్గస్తురాలయిన సంగతి తెలిసిందే.అయితే ఆమె మరణం ఇప్పుడు ఆమె కుటుంబంలో కలతలు రేపింది.ఆమె ఆస్ధి..స్ధిర,చర కలిపి దాదాపు ఆరు వందల మిలియన్ల నుంచి ఒక బిలియన్ మధ్య ఉంటుది. దాంతో ఆ ఆస్ది కోసం ఆమె కుటుంబ సభ్యులు,బిజినెస్ మేనేజర్స్, ఛారటీ సంస్ధల మధ్య పోరాటం మొదలైంది. ఆమె నగలు ను వేలం వేసి వచ్చిన డబ్బుని ఎయిడ్స్ ఫౌండేషన్ కి పంచాలని ఆమె విల్లులో ఉంది.మిగతా ఆస్ది గురించి స్పష్టంగా ఎవరకి ఏమి చెందాలో రాసి లేదు.అంతేగాక ఆమె దగ్గర ఎంతో కాలంగా ఉంటున్న వైట్ డైమండ్స్ ని ఎవరికి చెందాలనేది పెద్ద సమస్యగా మారింది.మైకెల్ జాక్సన్ మరణం అనంతరం జరిగిన వివాదాలు లాంటివే ఇప్పుడూ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇక ఎలిజిబుత్ టేలర్ కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, పదిమంది మనవలు, నలుగురు ముని మనవలు ఉన్నారు. దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఎలిజబెత్ టేలర్, చివరిసారిగా 2006లో సీఎన్ఎన్ చానల్ నిర్వహించిన లారీ కింగ్ లైవ్ అనే్ టాక్ షోలో కనిపించారు.