Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిజాలు చెప్పినందుకు పులిరాజా వారికి కోపమొచ్చింది..!!
మూగజీవాల సంరక్షణాత్మం ఏర్పడిన పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ (PETA) మీద పులిరాజా అలియాస్ టైగర్ వుడ్స్ కు కోపమొచ్చింది. ఎంతగా అంటే కోర్టుకు లాగుతానని హెచ్చరించేంతగా. మరి అంతగా కోపం రావడానికి కారణం ఆయన చేసిన నిర్వాకాన్ని(18 మందితో అక్రమసంబంధం నెరపడం) మంచి కోసం ఉపయోగించుకోవడమే. "అతి కామం అనర్థం" (Too much sex can be a bad thing) అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్న PETA అందుకు టైగర్ వుడ్స్ సరియైన వ్యక్తిగా భావించి ఆయన చిత్రం మీద ఈ స్లోగన్ రాసి ప్రచారం చెయ్యాలనుకున్నారట.
ఈ వార్త తెలిసిన టైగర్ వుడ్స్ కు పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఇటీవలే తను చేసిన తప్పులకు మీడియా క్షమాపన అడిగి చచ్చిన పాములాగా వున్న ఆయన్ను ఈ వార్త కలచివేసింది. అంతే వెంటనే తన లాయర్ కు కబురు చేసి PETA కు హెచ్చరికలు జారీచేసాడు. ఇక చేసేది లేక PETA బృందం ఈ ప్రకటన కోసం మరో ముఖాన్ని వెతికే పనిలో వున్నారట.