Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
నయన్ కష్టాన్ని గౌరవించాలి.. ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో కూడా స్నేహం.. ఏఆర్ మురుగదాస్ కామెంట్స్
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ దర్శకుడు, సామాజిక బాధ్యతతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కలిసి దర్బార్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ ఇద్దరు కలిసి ఓ చిత్రాన్ని చేయడానికి దాదాపు పదిహేనేళ్ల సమయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. మొదటి సారిగా సూపర్ స్టార్ను డైరెక్ట్ చేయనుండటం, అది కూడా కాప్ స్టోరీ కావడంతో ఈ చిత్రం తన కెరీర్లో ఎంతో ముఖ్యమని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం విడుదలకు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేసిన చిత్ర యూనిట్ శుక్రవారం ఘనం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. నేడు దర్శకుడు మురుగదాస్ మీడియాతో ఇంటరాక్ట్ అయి అనేక విషయాలను పంచుకున్నాడు.
కేవలం హీరో, విలన్ల మధ్యే..
దర్బార్ విశేషాలను చెబుతూ ఏఆర్ మురుగదాస్.. నయన్ పాత్ర తీరు వివరించాడు. ‘ఈ చిత్రం కేవలం హీరో, విలన్ల మధ్య జరిగేదే. ఇందులో ఎంటర్టైన్మెంట్ పార్ట్ వరకే నయనతార ఉంటుంద'ని పేర్కొన్నాడు.
డైరెక్టర్స్గా అది మా ఇష్టం..
గజినీ చిత్రంలో తన పాత్ర గురించి కామెంట్ చేస్తూ అత్యంత చెత్త పాత్ర అది, డైరెక్టర్ చెప్పింద ఒకటి చూపించింది ఒకటి అంటూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి చెబుతూ.. ‘ఓ దర్శకుడిగా ఏది కావాలి, ఏది తీసేయాలి, స్క్రిప్ట్ను ఎలా మార్చాలన్నది మా ఇష్టం.. ఫైనల్గా ఆడియెన్స్కు నచ్చిందా? లేదా? అన్నదే ముఖ్యమ'ని తెలిపాడు.
నయన్ కష్టాన్ని గౌరవించాలి..
అయినా మనస్పర్ఠలనేవీ ఎవరికైనా వస్తాయి. ఇలాంటి పురుషాధిక్య సమాజంలో వ్యక్తిగతంగా ఎన్ని దెబ్బలు తిన్నా.. ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత కష్టపడి ఉంటుంది. నయన్ పడిన ఈ కష్టాన్ని మనం గౌరవించాలి. మేమంతా ఒకే కుటుంబం ఇక ఆ విషయాల గురించి మరిచిపోతేనే మంచిద'ని అన్నారు.
ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో..
‘హిట్ ఇచ్చిన డైరెక్టర్తో ఎవరైనా బాగానే ఉంటారు. అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో కూడా క్లోజ్గా ఉండాలంటే పెద్ద హృదయం కావాలి. అది మహేష్ బాబుకు ఉంది. ఆయన ఎంత తెల్లగా ఉంటాడో.. మనసు అంత కంటే ఎక్కువ తెల్లగా ఉంటుంది. ఆయకు ఫ్లాప్ ఇచ్చానే అన్న గిల్టీ ఎప్పుడూ ఉంటుంది. సినిమా విడుదలయ్యాక వారం రోజుల పాటు ఆయన ఫోన్ చేస్తూనే వచ్చారు. ఆయనే నాకు ధైర్యం చెప్పారు.
అల్లు అర్జున్తో చర్చల్లో..
అల్లు అర్జున్తో ఇంకా ఫిక్స్ కాలేదు. చర్చల దశల్లోనే ఉంది. ఆయన కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. నా అసిస్టెంట్ డైరెక్టర్.. దర్శకుడిగా త్రిష హీరోయిన్గా ఓ చిత్రానికి కథ అందించాను. దాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. రాఘవేంద్రరావు గారు ఇండస్ట్రీకి హీరోయిన్లను ఇచ్చినట్టు.. బాల చందర్ గారు కమల్, రజినీ లాంటి గొప్ప హీరోలను ఇచ్చినట్టు.. నేను దర్శకులను ఇవ్వాలనుకుంటున్నాను.
ఆ క్యారెక్టర్ పేరు అలా..
ఈ చిత్రంలో మొదటగా రజినీ క్యారెక్టర్ పేరును ఫిక్స్ చేయలేదు. అయితే పోలీస్ డ్రెస్ రెడీ అయినప్పుడు ఏం పేరు పెట్టాలని అడిగారు. గజినీ సంజయ్ రామస్వామి అంటూ ఓ మోడ్రన్, ఓల్డ్ నేమ్స్ కలిసి పెట్టాను.. అలాగే ఈ సారి కూడా అనుకున్నాను. అలా వెంటనే నా కొడుకు పేరు, నా తండ్రి పేరు కలిసి ఆదిత్య అరుణాచలం అని పెట్టాను. అలా రెండూ కలిపేసరికి సౌండ్ కూడా బాగానే అనిపించింద'ని అన్నారు.