Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఆ రోజు నిర్మాతగా కాదు.. పవన్ ఫ్యాన్గానే.. అరుపులు, కేకలతో ఉద్వేగం.. మనసులో మాట చెప్పిన దిల్ రాజు
వకీల్ సాబ్ చిత్రంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన తన మనసులోని మాటలను పంచుకొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్తో ఉన్న అనుబంధం, సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. తెలుగు ఫిల్మీబీట్తో దిల్ రాజు మాట్లాడుతూ..
ప్రతీ సినిమాకు రేంజ్ పెంచుకొంటూ
పవన్ కల్యాణ్ను కెరీర్ ఆరంభం నుంచి చూస్తూ వస్తున్నాను. పవర్ స్టార్కు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ లాంటి సినిమాలతో తన రేంజ్, స్టైల్ను పెంచుకొంటూ పోయారు. ఎవరూ ఊహించని విధంగా కెరీర్ను ప్లాన్ చేసుకొన్నారు. ఇతరుల్లో లేని ఆయనకు ఉన్న స్టైల్ను బట్టి వకీల్ సాబ్ సినిమాను చేశాం అని దిల్ రాజు చెప్పారు.
సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్గా
నిర్మాతగా మారిన తర్వాత ఫలానా హీరోతోనే సినిమా చేయాలనే పరిమితిని నేను విధించుకోలేదు. ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, మహేష్తోపాటు దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేశాను. ఇక ముందు కూడా అలాగే సినిమా తీస్తాను. తొలి ప్రేమ సినిమా నా గుండెల్లో అలా నిలిచిపోయింది. వకీల్ సాబ్ ట్రైలర్ను సుదర్శన్ థియేటర్లో రిలీజ్ చేసిన సమయంలో ఓ ఫ్యాన్గా మారిపోయాను. ఆ మూమెంట్తో ఆ రోజు ఓ భావోద్వేగానికి గురయ్యాను అని దిల్ రాజు తెలిపారు.
మాస్క్ తీసుకు రాకపోతే
లాక్డౌన్
తర్వాత
పరిస్థితులు
మారిపోయాయి.
మాస్క్,
శానిటైజర్
సిద్దం
చేసుకొని
సినిమా
థియేటర్లకు
రావాలని
కోరుతున్నాం.
ఒకవేళ
ఎవరైనా
మాస్క్
తీసుకురాకపోతే
థియేటర్
వద్ద
మాస్క్లు
అందించే
ఏర్పాట్లు
చేస్తున్నాం.
అన్ని
జాగ్రత్తలు
తీసుకొని
సినిమా
చూడమనేది
మా
రిక్వెస్ట్
అని
దిల్
రాజు
పేర్కొన్నారు.
15 నెలలుగా స్టార్ హీరో సినిమా
టాలీవుడ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్ హీరో సినిమా రాక 15 నెలలైంది. కరోనా సమయంలో థియేటర్కు వెళితే ఏమవుతుందో అని చాలా మందికి భయాలున్నాయి. అయితే చాలా మంది సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మూవీతో వినోదానికి దూరమవుతున్నామనే వారికి ఊరట లభిస్తుంది అని దిల్ రాజు అన్నారు.
Recommended Video
ప్రేక్షకుడే జాగ్రత్తలు తీసుకోవాలి
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు సంబంధించి 50 శాతం అక్యుపెన్సీ ఇచ్చే అవకాశం పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందో వేచి చూడాలి. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏదైనా జరిగిందా. సేఫ్టీ ఏంటి అనేది కోర్టు అడిగింది. ప్రేక్షకుడే తనవంతుగా జాగ్రత్తలు చూసుకుంటూ ఎంజాయ్ చేయమని చెబుతున్నాం. అన్ని థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు మాస్క్లు పెట్టుకొనేలా, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని దిల్ రాజు చెప్పారు.