Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రధాని ఆహ్వానం, కశ్మీర్ సమస్యపై కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్..
అందాల తార కాజల్ అగర్వాల్ సినిమా పరంగానే కాకుండా సమాజసేవకు అంకితమయ్యారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో జరుగుతున్న విషయాలను కూడా ఫాలో అవుతుంటానని చెప్పారు. ఇటీవల దేశంలో చోటు చేసుకొన్న కాశ్మీర్ సమస్య గురించి ప్రస్తావించారు. తాజాగా ఆమె నటించిన రణరంగం సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రధాని ఆహ్వానంపై, కశ్మీర్ అంశాలపై స్పందించారు. కశ్మీర్ సమస్యపై ఆమె చెప్పిన విషయాలు ఇవే..
ప్రధాని ఆహ్వానంపై స్పందన ఇలా
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది నిజమే. కానీ చివరి నిమిషంలో ఆహ్వానం అందడంతో వెళ్లలేకపోయాను. వేరే బిజీ షెడ్యూల్ కారణాల వల్ల కూడా వీలు కలుగలేదు. ఫ్లయిట్ టికెట్లు కూడా దొరకపోవడం కూడా ఓ కారణమైంది. వెళ్లలేకపోయానే అనే అసంతృప్తి ఇప్పటికీ ఉంటుంది అని కాజల్ చెప్పారు.
కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు గురించి
కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు గురించి ఫాలో అవుతున్నాను. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశానికి మంచి జరుగుతున్నదని భావిస్తున్నాం. ఆ ప్రాంతంలో అభివృద్ధికి ఆస్కారం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం అక్కడి ప్రజలకు అందుతుంది. ఇక నుంచి నేరుగా ప్రభుత్వ పథకాలు అందుతాయని అనుకొంటున్నాను. నేను ఒకేసారి నేను కశ్మీర్ వెళ్లాను. అక్కడి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయని నేను చాలా విన్నాను అని కాజల్ తలిపారు.
కశ్మీర్లో పరిస్థితులు చాలా దారుణం
కశ్మీర్ భూతల స్వర్గమనేది నాకు ఓ ఫీలింగ్ ఉంది. నా తల్లిదండ్రులు చాలాసార్లు వెళ్లారు. అక్కడి సమస్యలను, విపత్కర పరిస్థితులను వారు ప్రత్యక్షంగా చూశారు. ఓసారి నా తల్లి చిప్స్ ప్యాకెట్ కొంటే.. ఐదేళ్ల క్రితం ఎక్స్పైరీ ఉన్న ప్యాకెట్ వారికి ఇచ్చారు. దానిని బట్టి అక్కడి పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు అని కాజల్ అన్నారు.
అభివృద్ది జరగడం ఖాయమని
కశ్మీర్లో స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతాయని బలంగా నమ్ముతున్నాను. అక్కడ ఉపాధి, ఉద్యోగ కల్పన జరుగుతుందని కూడా అనుకొంటున్నాను. టూరిజం, బిజినెస్ అవకాశాలు భారీగా పెరుగుతాయని కూడా భావిస్తున్నాను. ఇక భవిష్యత్లో రాజకీయాల్లోకి వస్తానో లేదో తెలియదు.. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన నాకు లేదు. అరకు లాంటి ప్రదేశాల్లో గిరిజన పిల్లలకు విద్యా బోధన లాంటి అంశాలతో సమాజ సేవలో ఉన్నాను కాజల్ తెలిపారు.