Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్వరలోనే ఓ ఇంటిదాన్ని కాబోతున్నా.. అందుకే తమిళ పరిశ్రమకు దూరం.. నివేదా
దక్షిణాది మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. కేవలం ఆమె ఫెర్ఫార్మెన్స్ కారణంగా పలు సినిమాలు సక్సెస్ దారి పట్టాయి. నిన్ను కోరి, జెంటిల్మెన్, జై లవకుశ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె నటించిన చిత్రం బ్రోచేవారెవరురా. మెంటల్ మదిలో ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 28న రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా నివేదా మీడియాతో మాట్లాడుతూ..
విభిన్నమైన సినిమాగా బ్రోచేవారెవరురా
బ్రోచేవారెవరురా చిత్రం సమాజంలోని పరిస్థితులకు అద్దం పట్టే విభిన్నమైన కథ. సమాజంలోని రకరకాల మనస్తత్వాన్ని తెలిపే సినిమా. బంధాలు, అనుబంధాలు, భావోద్వేగమైన అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు మిత్ర. మానసికంగా ధృడంగా ఉండే యువతి పాత్ర. తండ్రి, కూతుళ్ల మధ్య ఎమోషనల్గా కథ నడుస్తుంది అని నివేదా థామస్ చెప్పారు.
తెలుగు ఇండస్ట్రీకే పరిమితం
జెంటిల్మన్ సినిమా తర్వాత ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీకే పరిమితం అయ్యాను. తమిళ, మలయాళ చిత్రాలకు కొంత దూరమైనట్టే చెప్పవచ్చు. జెంటిల్మెన్ సినిమాలో డబ్బింగ్ చెప్పాలనుకొన్నాను. కానీ నాకు పరీక్షలు ఉండటం వల్ల చెప్పలేకపోయాను. ఆ కోరికను 118తో తీర్చుకొన్నాను. మళ్లీ ఇప్పుడు మిత్రా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకొన్నాను అని నివేదా థామస్ పేర్కొన్నారు.
తెలుగులో వరుసగా ఆఫర్లు రావడంతో
తమిళంలో ఎక్కువగా నటించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవు. జెంటిల్ మెన్ తర్వాత వరుసగా తెలుగులో ఆఫర్లు పలకరించాయి. అందుకే ఇక్కడే సెటిల్ అయినట్టు అనిపిస్తున్నది. హైదరాబాద్లో ఇల్లు కొనాలని అనుకొంటున్నాను. త్వరలోనే ఆ కోరిక తీరుతుందని అనుకొంటాను అని నివేదా థామస్ తెలిపారు.
హీరోను నేను దృష్టిలో పెట్టుకోను
నేను హీరోను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయను. నేను నటించే సినిమా చిత్రీకరణ ఎక్కువ రోజులు ఉండటం వల్ల మరిన్నీ సినిమాలు చేయలేకపోతున్నాను. హీరో ఎవరన్నది పట్టించుకోను. కథ, నా పాత్ర ఎలా ఉందని మాత్రమే చూసుకొంటాను. జై లవకుశ మాత్రం ఎన్టీఆర్ కోసం చేశాను అని నివేదా థామస్ అన్నారు.
నివేదా థామస్ కెరీర్ గురించి
ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను ఒకటి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న వీ చిత్రం, రెండోది ‘శ్వాస' అనే చిత్రంలోనూ నటిస్తున్నా. తమిళంలో కమల్హాసన్తో కలిసి పాపనాశం నటించాను. రజనీకాంత్ సినిమా దర్బార్ గురించి ఇప్పుడే నేనేమీ చెప్పలేను. కొద్దిరోజులు ఆగితే మీకే తెలుస్తుంది అని నివేదా థామస్ అన్నారు.