Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెన్నుపోటుకే వెన్నుపోటుదారుడు.. ఆ ఎమ్మెల్యేపై రాంగోపాల్ వర్మ ఫైర్!
దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. రిలీజ్కు ముందే ఈ చిత్రం పలు వివాదాలకు కేంద్ర బిందువు అయింది. సెన్సార్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా వేసింది. ఇంకా సెన్సార్ పూర్తి కాకుండానే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెలుగు ఫిల్మీబీట్తో మాట్లాడుతూ..
వెన్నుపోట్లు లేకుండా జీవితం ఉండదు
వెన్నుపోట్లు లేకుండా జీవితం, రాజకీయాలు ముందుకు సాగవు. ఎక్కడ చూసినా వెన్నుపోట్లే కనిపిస్తాయి. నా జీవితంలో నన్ను ఎవరు వెన్నుపోటు పొడవలేదు. నేను కూడా ఎవర్ని వెన్నుపోటు పొడవలేదు. నాదంతా ముందుపోటే. అని వర్మ అన్నారు.
కర్నూలు ఎమ్మెల్యే నాపై ఫిర్యాదు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని దగా అనే పాట విడుదల చేసినప్పుడు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నాపై కేసు నమోదు చేశాడు. చంద్రబాబును ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నది. దగా పాటను సినిమా నుంచి తీసేయాలి. అలాంటి వ్యక్తే వెన్నుపోటుదారుడిగా మారిపోయాడు అని పిటిషన్లో పేర్కొన్నాడు.
చంద్రబాబుకే ఎస్వీ వెన్నుపోటు
అయితే ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీటు ఇవ్వలేదు. దానికి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరాడు. వెన్నుపోటు అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. వెన్నుపోట్లు లేకుండా జీవితం సాగదని నా అభిప్రాయం అని వర్మ చెప్పారు.
వెన్నుపోటు అని స్వయంగా ఎన్టీఆరే చెప్పారు
ఎన్టీఆర్పై వెన్నుపోటు కుట్ర జరిగిందని నేనే కాదు.. అందరికీ తెలుసు. స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించాడు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెన్నుపోటు జరిగిందని చెప్పడానికి అది బలమైన పాయింట్ అని నేను నమ్ముతున్నాను. నిజం బయటకు వస్తుందనే కారణంతో సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.
అపార్థాలు, అపోహలు తొలిగిపోతాయా?
మహానటుడు ఎన్టీఆర్కు లక్ష్మీపార్వతి లాంటి సాధారణ మహిళ ఎలా చేరువైంది. అంత చేరువగా కావడానికి బలమైన కారణం ఏమిటనదనేది చాలా ఆసక్తికరమైన పాయింట్. లక్ష్మీ ఎన్టీఆర్లో లక్ష్మీపార్వతిపై అనేక ఆరోపణలు, అపార్థాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆమెపై అపార్థాలు, అపోహలు తొలిగిపోతాయా? పెరుగుతాయా అనేది సినిమా రిలీజ్ తర్వాతే డిసైడ్ అవుతుంది.