Just In
- 46 min ago
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు: ఫస్ట్ డే రెస్పాన్స్.. వర్మ షాకింగ్ రియాక్షన్
- 1 hr ago
అర్జున్ రెడ్డి భామకు బంపర్ ఆఫర్.. ఇక అతగాడితో ముద్దుల వర్షమే!
- 1 hr ago
గుడ్ బై చెప్పాలనుకున్నా.. ఎన్టీఆర్, ప్రభాస్లతో! అసలు విషయం బయటపెట్టిన వెంకటేష్
- 2 hrs ago
మొత్తానికి ఫైనల్ చేశారు.. ఇక బాలకృష్ణ కష్టాలకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
Don't Miss!
- Finance
ఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగిస్తున్నారా..ఆలోచించండి, మీ డబ్బు దొంగిలించొచ్చు!: కస్టమర్లకు SBI
- News
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలు: విజయం దిశగా కన్జర్వేటివ్ పార్టీ.. తిరిగి ప్రధానిగా బోరిస్ జాన్సన్
- Sports
క్రీజు వదిలిపోను.. పఠాన్, రహానే మధ్య వాగ్వాదం వీడియో!!
- Technology
లాంగ్ టర్మ్ ప్యాక్లను తొలగించిన DTH ఆపరేటర్లు
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 13-12-2019
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
నా కెరీర్లో ఫస్ట్ టైమ్ అలాంటి చిత్రం.. అది జనసేన కాదు మనసేన.. ఆర్జీవీ కామెంట్స్
వివాదాలతో సావాసం చేసే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఏ చిత్రాన్ని ప్రకటించినా, తెరకెక్కించినా కాంట్రవర్సీ మొదలవ్వాల్సిందే. వివాదాలతో కూడిన సినిమాలను తీయడం, ఏ సినిమా అయినా వివాదాల్లో చిక్కుకోవడం వర్మ ప్రత్యేకత. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆర్జీవీ గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా కోర్టు మెట్ల వరకు చేరుకుంది. ఈ క్రమంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

కెరీర్లో ఫస్ట్ టైమ్..
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రం సందేశాత్మక చిత్రమని, తన కెరీర్లోనే మొట్టమొదటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రమని పేర్కొన్నాడు. భవిష్యత్తును ఊహించిన తెరకెక్కించిన కల్పితగాథ అని, ఇందులో నిజజీవితంలో ఉన్న కొందరి వ్యక్తులను పోలి ఉండటం కేవలం యాదృచ్చికమేనని అన్నాడు.

వారికే అంకితం..
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణకు అంకితమిస్తున్నట్టుగా చెప్పిన ఆర్జీవీ.. ఈ చిత్రాన్ని మాత్రం ప్రఖ్యాతి గాంచిన తండ్రీ కొడుకులకు ఇస్తానని తెలిపాడు. అయితే వారెవరో మాత్రం తాను చెప్పనని, అడగొద్దని మీడియాను కోరాడు.

ఆయన్ను పట్టించుకోవడం మానేశాను..
కేఏ పాల్పై ఓ సాంగ్ను విడుదల చేయగా..అది ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటపై కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడితూ ఆర్జీవీపై అంత ఎత్తుకు లేచాడు. ఇదే విషయాన్ని వర్మ వద్ద ప్రస్థావిస్తే.. ఆయన్ను పట్టించుకోవడం మానేశానని, ఆయన ప్రస్తుతం ప్రపంచ యుద్దాలను ఆపే పనిలో బిజీగా ఉన్నాడని సెటైరికల్గా స్పందించాడు.

అది జనసేన కాదు..
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ను చూపించానని అందరూ అంటున్నారు అది నిజం కాదని.. అతను పవన్ కళ్యాణ్ను పోలిన వ్యక్తి అని అంతేకాకుండా అతని పార్టీ పేరు మనసేన అని అన్నాడు. ఆ పార్టీకి జనసేనకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.

ఆ సీన్ వాళ్లకే బాగా నచ్చింది..
ట్రైలర్లో చూపించిన ఓ సీన్ (తన కొడుక్కు ప్రేమగా పప్పు వడ్డించడం) తెలుగు దేశం పార్టీ వాళ్లకే బాగా నచ్చిందని, ఫోన్లు చేసి మరీ చెబుతున్నారని అన్నాడు. వారికి ఎందుకు నచ్చిందో మీకే (మీడియా) తెలియాలన్నాడు.

సినిమా అందుకే చూడాలి..
మంచి భోజనం అంటే పప్పు అంటే.. మనందరం మంచి భోజనం ఎందుకు చేయాలంటే.. అందుకు ఈ సినిమాను చూడాలని చెప్పుకొచ్చాడు. మహారాష్ట్ర రాజకీయాలపై సినిమా అంటే మరో సర్కార్ తీయాలన్నాడు. దెయ్యాలు, గ్యాంగ్ స్టర్ చిత్రాల కంటే పొలిటికల్ క్రైమ్ బాగా ఉంటోందని అందుకే ఇటు వైపు వచ్చానని తెలిపాడు.