Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కథను కెలుకొద్దని అనుకొన్నా.. ప్రియమణిని అందుకే తీసుకొన్నాం... అసురన్ రీమేక్ గురించి శ్రీకాంత్ అడ్డాల
అసురన్ రీమేక్గా వస్తున్న నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. వెంకటేష్, ప్రియమణి నటించిన ఈ చిత్రానికి సెన్సిటీవ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల నారప్ప మూవీ గురించి వెల్లడిస్తూ...
ఇప్పటికి వరకు ఫ్యామిలీ, సెన్సిటివ్ మూవీలు మాత్రమే తీస్తారనే బ్రాండ్ పడింది. కానీ నా ఇమేజ్కు భిన్నంగా మాస్ మూవీతో వస్తున్నాను. అసురన్ రీమేక్ కావడంతో ఆ సినిమా కథను కెలుక వద్దని డిసైడ్ అయ్యాం. ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ మాత్రమే వర్కవుట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకొన్నాం. ఆ కోణంలో మేము భావోద్వేగాలను పండించడంలో సక్సెస్ అయ్యాం అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.
అసురన్ సినిమాకు భారీ క్రేజ్ రావడంతో వెంకటేష్ బాబు, సురేష్ బాబు రీమేక్స్ రైట్స్ కొనుకొన్నారు. అయితే ఏదో పనిమీద వారిని కలిస్తే అసురన్ రీమేక్ గురించి చర్చ వచ్చింది. అయితే మీకు అభ్యంతరం లేకపోతే నేను చేస్తానని చెప్పాను. వారికి నాపై నమ్మకం కలిగింది. అలా ఈ సినిమాకు వెంకటేష్ అనుకొన్న తర్వాత నన్ను ఈ సినిమాకు తీసుకొన్నారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎమోషన్స్ పండించడం నాకు ఛాలెంజ్ అనిపించింది అని శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలన్న విషయాన్ని జీర్ణించుకోవడానికి రెండు రోజులు పట్టింది. నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలన్నది తమిళ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్ణయం. ఈ విషయంలో వెంకటేష్ కూడా కాస్త నిరాశపడ్డారు. పరిస్థితుల్లో తప్పని పరిస్థితి అని శ్రీకాంత్ అడ్డాల అన్నారు.
అసురన్ సినిమా చూసినప్పుడు తల్లి పాత్రకు ప్రియమణి అయితే బాగుంటుందనిపించింది. ఆమె పరుత్తీవీరన్ సినిమాలో నటించిన తీరు ఆకట్టుకొన్నాయి. అందుకే ప్రియమణిని తీసుకొన్నాం అని శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు. అలాగే వెంకటేష్ కొండల్లో గుట్టల్లో, ఇసుక, మురికి నీటిలో సీన్లు చేస్తూ చాలా కష్టపడ్డారు. ఆయన ఫెర్ఫార్మెన్స్ చూస్తే.. పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది అని అన్నారు.