Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లాగిపెట్టి ముఖంపై కొట్టారు.. ప్రకాశ్ రాజ్.. విలక్షణ నటుడికి చేదు అనుభవం
సినీ రంగంలో స్టార్ యాక్టర్గా రాణించిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేదు అనుభవం ఎదురైంది. రాజకీయాల్లో కూడా రాణించాలనే కలతో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. మోదీపై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించిన ఈ విలక్షణ నటుడు ఓటమిపాలయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలువడం ఆయనను షాక్కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..
మూడోస్థానంలో ప్రకాశ్ రాజ్
బెంగళూరు సెంట్రల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్, ప్రకాశ్ రాజ్ పోటీ పడ్డారు. జనవరి 1 నుంచి ప్రకాశ్ రాజ్ ప్రచారం చేపట్టారు. ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా ఆయన మూడో స్థానానికి పడిపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఓటర్లు చాచిపెట్టి కొట్టారని
కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో తన ఓటమిపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఓటర్లు చాచి ముఖంపై కొట్టినట్టు అనిపిస్తున్నది. నాపై దూషణలకు, ట్రోల్స్, మానసిక వేధనల మధ్య ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
కఠినమైన పోరాటం మొదలైందని
గెలుపు, ఓటములు పక్కన పెడితే లౌకిక భారత్ ఏర్పాటు కోసం నా పొరాటం కొనసాగుతుంది. ఓటమి తర్వాత మరో కఠినమైన పోరాటం మొదలైందని భావిస్తున్నాం. పోరాటం చేసే క్రమంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటాను అని ప్రకాశ్ రాజ్ మీడియాతో అన్నారు.
ప్రకాశ్ రాజ్ ఓటమితో
బెంగళూరు సెంట్రల్లో తన గెలుపు కోసం ప్రకాశ్ రాజ్ వినూత్న ప్రచారం చేపట్టారు. సామాజిక, స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని హమీ ఇచ్చారు. సాధారణ పౌరుడి మాదిరిగా ప్రకాశ్ ఆటో రిక్షాలో ప్రచారం చేశారు. పేద, మధ్య తరగతి ఓటర్లను ఆకట్టుకొంటున్నారనే విశ్లేషణ మధ్య ప్రకాశ్ రాజ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.