Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అధీరా పాత్రలో సంజయ్ దత్ ఎందుకంటే.. సీక్రెట్ చెప్పిన యష్
కేజీఎఫ్ చాప్టర్ 1 ఘన విజయం తర్వాత రూపొందుతున్న సీక్వెల్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. కేజీఎఫ్2 పలు సంచలనాలతో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారనే వార్త సంచలనం రేపింది. అయితే తాజాగా రిలీజైన అధీరా పాత్రలో సంజయ్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అయితే సంజయ్దత్నే ఎందుకు తీసుకొన్నారనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సంజయ్ దత్ ఎంపికపై ఇటీవల యష్ మీడియాతో మాట్లాడుతూ.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ చెప్పినప్పుడే అధీరా పాత్రకు సంజయ్ దత్ లాంటి వ్యక్తి అయితే బాగుంటుందని అన్నారు. కథ మొదలుపెట్టినప్పుడే అలాంటి ఆలోచనలతో పాత్రను రాసుకొన్నాడు. ఐదు భాషల్లో కేజీఎఫ్ 2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు సంజయ్ దత్ తప్పనిసరి అని భావించాం అని అన్నారు.
అధీరా పాత్రలో సంజయ్ దత్ ఒదిగిపోయాడు. ఆయన నటన ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్తుంది. కేజీఎఫ్ 2 సినిమాకు సంజయ్ దత్ వెన్నముకలా మారడం ఖాయం. ఎప్పుడైతే కథ బాగుంటుందో.. ఇతర అంశాలన్నీ దానిలో భాగమవుతాయి అని యష్ అన్నారు. ప్రశాంత్ నీల్ ఎప్పుడూ స్వచ్ఛంగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనల్లో స్వచ్ఛత కనిపిస్తుంది అని అన్నారు.
సంజయ్ దత్ అద్భుతమైన యాక్టర్. అతడి దేహధారుడ్యం, ఇమేజ్, లెగసీ లాంటి అంశాలు కేజీఎఫ్ 2 సినిమాకు అత్యంత పాజిటివ్గా మారుతాయి అని అన్నారు. సంజయ్ దత్ ప్రస్తుతం కేజీఎఫ్ షూటింగ్తో బిజీగా ఉన్నారు.
కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా కన్నడలోనే కాకుండా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను విజయ్ కిరంగదూర్ నిర్మించగా శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, వశిష్ట ఎన్ థామస్ నటించారు.