Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వివాహేతర సంబంధం, ఆపై దాడి: భర్తపై ఫిర్యాదు చేసిన హీరోయిన్
Recommended Video
కన్నడలో ఖుషి, శిష్యా లాంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ చైత్రా తన భర్తపై బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా, మానిసికంగా హింసిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నెల రోజులుగా వేధింపులు
2006లో లిక్కర్ వ్యాపారి, రియల్టర్ అయిన బాలాజీ పోతరాజ్తో తనకు వివాహం జరిగిందని, గత నెల రోజులుగా తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చైత్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రక్తం వచ్చేలా దాడి చేశాడు
ఈనెల 14న చిన్న విషయానికి గొడవపడి తీవ్రంగా దాడి చేశాడు. నోరు, ముక్క భాగాలు నుండి రక్తం కారేలా తలను గోడకేసిన కొట్టాడు. గొంతు పట్టుకుని పొట్ట, పలు చోట్ల తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడితో తాను స్పృహ కోల్పోయాను అని ఆమె తెలిపారు.
ఆమెతో వివాహేతర సంబంధం
అమూల్య అనే యువతితో నా భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, అడ్డుగా ఉన్న తనను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, తనను హత్య చేయాలనుకున్నాడు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రస్తుతం తాను పుట్టింట్లో ఆశ్రయం పొందుతున్నాను. తనపై దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసించిన బాలాజీ పోతరాజ్ మీద చట్టపరంగా కఠని చర్యలు తీసుకోవాలని చైతన్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చైత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.