Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ నటి భర్తను మింగేసిన కరోనా రక్కసి !
కరోనా వైరస్ కల్లోలం ఆగడం లేదు. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతూ అందరిలో టెన్షన్ రేపుతోంది. మొదటి వేవ్ కంటే దారుణంగా ఉన్న ఈ సెకండ్ వేవ్ ఈ సారి సెలబ్రిటీలు, సినిమా వాళ్ళను కూడా వదలడం లేదు. ఈరోజు ఉదయం తెలుగు దర్శకుడు ఒకరు కరోనా కారణంగా మనకి దూరం కాగా ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత ఒకరు కన్ను మూశారు. వివరాల్లోకి వెళ్తే
మూడు రోజుల నుండి పోరాడుతూ
నిర్మాత, నటి మాలాశ్రీ భర్త రాము ఈ రోజు కరోనా వైరస్ కారణంగా మరణించారు. రాము కన్నడ సినిమా పరిశ్రమలో కోటి రాముగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అనేక కన్నడ హిట్ సినిమాలను నిర్మించారు. గత వారం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో మూడు రోజుల క్రితం బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నా, చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది సేపటి క్రితం ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించారు.
అమితాబ్ బచ్చన్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ
ఇక నటి మాలాశ్రీ తెలుగు వారికి సుపరిచితురాలు. మాలాశ్రీ బాలనటిగా తెలుగు ,తమిళ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించి, మెప్పించింది. ఆమె పెద్దయ్యాక కన్నడ సినిమా నంజుడి కల్యాణ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి కన్నడ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. 1980-90 దశకంలో ఆమె నటించిన ప్రతి కన్నడ సినిమా హిట్ గా మారిపోవడంతో లక్కీ స్టార్ అనే పేరు కూడా తెచ్చుకుంది. అంతేకాదు, కన్నడ రంగంలో యాక్షన్ హీరోయిన్ పాత్రకు పెట్టింది పేరుగా నిలిచి అమితాబ్ బచ్చన్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీగా అనిపించుకుంది.
తెలుగు వారికి సుపరిచితురాలు
తెలుగులో కూడా ఆమె అనేక హిట్ సినిమాల్లో నటించింది. ప్రేమ ఖైదీ, పరువు ప్రతిష్ట, బావమరిది, ఊర్మిళ, తోడికోడళ్లు, బంగారు మొగుడు , అల్లరి పోలీసు, ఆంధ్ర కిరణ్ బేడీ, సాహసవీరుడు సాగరకన్య, భద్రాచలం, చాముండి, ఘరానా అల్లుడు, మన్మద సామ్రాజ్యం, నీ ప్రేమకే లాంటి అనేక హిట్ సినిమాలతో తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. హీరో సుమన్ తో కలిసి మాలాశ్రీ ఎక్కువ సినిమాల్లో నటించారు. మాలాశ్రీ కన్నడలో నటించిన అనేక సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేశారు. అప్పట్లోనే కన్నడలో భారీ చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాత రామును మాలాశ్రీ వివాహం చేసుకుంది. ఆమెకు భర్త అంటే ప్రాణం, ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Recommended Video
చివరిసారిగా 2017లో
మాలాశ్రీ చివరిసారిగా 2017 లో తిరిగి 'ఉప్పు హులీ ఖారా' చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె పెద్దగా సినిమాల మీద ఆసక్తి చూపలేదు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ఆమె తరచూ ఏవో ఒక పోస్ట్ లు పెడుతూ కాస్త సోషల్ మీడియాలో ఈ మధ్యే కాస్త యాక్టివ్ అయ్యారు. ఈ పోస్టులలో కూడా ఎక్కువగా దైవానికి సంబంధించిన, తన భర్తతో దిగిన ఫోటోలు ఆమె అప్లోడ్ చేస్తూ ఉంటారు.