Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆమె పిరికితనంతో పారిపోయింది, నేనలా కాదు.. చక్కెరలా ఉన్నానని!
సీనియర్ హీరో అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శృతి హరిహరన్ చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటోంది. అర్జున్ తనని వేధించినట్లు ఆధారాలతో సహా బయట పెడతానంటూ శృతి హరిహరన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే శృతి హరిహరన్ అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజగా శృతి హరిహరన్ మహిళా కమిషన్ ముందు కూడా ప్రత్యక్షమైంది. శృతి హరిహరన్ కేసుని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే.
పిరికితనంతో పారిపోయింది
మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన శృతి హరిహరన్ మీడియాతో విచారణ సారాంశాన్ని వివరించింది. చాలా రోజులుగా విచారణకు రమ్మని మహిళా కమిషన్ చైర్మన్ నాగ లక్ష్మి శృతి హరిహరన్ ని కోరుతున్నారు. కానీ వ్యక్తిగత కారణాలవలన ఇన్నిరోజులు విచారణకు హాజరు కాలేకపోయానని శృతి హరిహరన్ తెలిపింది. మహిళా కమిషన్ అధ్యక్షురాలు తనతో చర్చించిన తీరు సంతృప్తిగా ఉందని శృతి తెలిపింది.
ప్రత్యేక గదిలోకి తీసుకుని వెళ్లి
నాగలక్ష్మి తనని ప్రత్యేక గదిలోకి తీసుకుని వెళ్లి విచారించారు. అర్జున్ వలన తాను ఎదుర్కన్న లైంగిక వేధింపులన్నీ ఆమెకు వివరించాను. నా వాంగ్మూలాన్ని ఆమె రికార్డ్ చేసుకున్నారు. మహిళా కమిషన్ తనకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నానని శృతి తెలిపింది. లైంగిక వేధింపులకు సంబందించిన విషయాలు పోలీసులకుగాని, మహిళా కమిషన్ కు కానీ తెలియజేయాలి. సోషల్ మీడియాలో పబ్లిక్ గా ప్రస్తావించడం తగదని ఆమె తనకు సూచించినట్లు శృతి మీడియాకు తెలిపింది.
పిరికితనంతో పారిపోయింది
ఈ సందర్భంగా శృతి హరిహరన్ మరో హీరోయిన్ సంజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఉద్యమం నుంచి సంజన పిరికితనంతో పారిపోయింది. ఆమె అలా చేయడం తనకు బాధ కలిగించిందని శృతి తెలిపింది. కానీ తాను మాత్రం ప్రాణ హాని ఉందని తెలిసినా వెనకడుగు వేయమని తేల్చి చెప్పింది. సినిమా రంగంలో ఉన్న ప్రతి మహిళ ఎదో విధంగా వేధింపులకు గురవుతూనే ఉన్నారు అంటూ శృతి పేర్కొంది.
చక్కెరలా ఉన్నాను
ఈ సందర్భంగా శృతి మీడియాపై కూడా జోకులు పేల్చింది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి మీరంతా వస్తున్నారు. మీరంతా నా వెంట చీమలలాగా వెంట పడుతున్నారు. నేను చక్కెరలా ఉన్నాను అంటూ సెటైర్లు వేసింది. నాకు మీడియా అంటే గౌరవం ఉంది. కేసు కొనసాగతూ ఉండడం వలన అన్ని విషయాలు మాట్లాడడం కుదరదు అని వెళ్ళిపోయింది.