Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఆ హీరోయిన్ ఇంత మోసగత్తా..30 లక్షలు ఎలా కొల్లగొట్టిందో తెలుసా, హైలెవెల్ చీటింగ్!
దక్షణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ సింధుమీనన్ సినిమా అభిమానులకు బాగా గుర్తుండే ఉంటుంది. చందమామ, వైశాలి వంటి చిత్రాలతో తెలుగువారికి సింధు మీనన్ బాగా చేరువైంది. వైశాలి చిత్రంలో సింధు మీనన్ నటనకు అద్భుతంగా ఉంటుంది. అలాంటి అంటి చీటింగ్ కేసులో ఇరుక్కుంది అంటే నమ్మగలరా! నిజంగా ఇది ఆశ్చర్య కర విషయమే. బెంగుళూరులోని బ్యాంకు ఆఫ్ బరోడా లో నకిలీ డాక్యుమెంట్లతో సింధు మీనన్ సోదరుడు లక్షల రూపాయల్లో చీటింగ్ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ లు కేసు నమోదు చేసారు. సింధు మీనన్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
సౌత్ లో మంచి క్రేజ్
సింధు మీనన్ కు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. చందమామ, వైశాలి వంటి చిత్రాలతో సింధు మీనన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైశాలి చిత్రంలో సింధు మీనన్ నటన అదుర్స్ అని చెప్పుచు. ఇవి కాక పలు మలయాళీ, తమిళ చిత్రాల్లో కూడా సింధు మీనన్ నటించింది.
సింధు మీనన్ అంత మోసగత్తా
సింధు మీనన్ అమాయక చూపులు, అందమైన రూపం అందరిని కట్టుకుంటాయి. కానీ ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది అంటే నమ్మగలరా. అవును ఇది నిజం. సింధుమీనన్ నకిలీ డాక్యుమెంట్లతో బెంగుళూరులోని బ్యాంకు ఆఫ్ బరోడా కు 30 లక్షలు టోకరా పెట్టినట్లు తెలుస్తోంది.
నకిలీ పత్రాలతో సింధు మీనన్ సోదరుడు
సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ బ్యాంకు కు నకిలీ పత్రాలు సమర్పించి 30 లక్షలు రుణం పొందారు. ఎంతకీ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు మేనేజర్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు మహిళల సాయంతో
సింధు మీనన్ సోదరుడు ఈ నకిలీ పత్రాలని నాగశ్రీ శివన్న, సుధా రాజశేఖర్ అనే మహిళల సాయంతో సృష్టించినట్లు తెలుస్తోంది. ఇందులో సింధు మీనన్ ప్రమేయం ఉందని తేలితే ఆమెని అరెస్టు చేస్తామని పోలీస్ లు చెబుతున్నారు. ప్రస్తుతం సింధు మీనన్ అమెరికాలో ఉందని ఆమె కు నోటీసులు జారీ చేసినట్లు పోలీస్ లు తెలిపారు.