Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘KGF’ టీమ్కు భారీ షాక్.. షూటింగ్ ఆపాలంటూ కోర్టు తీర్పు.. నిర్మాతలకు బిగ్ లాస్
కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు స్టైలిష్ హీరో యశ్. అక్కడ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'కేజీఎఫ్ చాప్టర్ 1'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో అతడి ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు, 'కేజీఎఫ్ చాప్టర్ 2' పైనా ఆసక్తి పెరిగిపోయింది. సినీ ప్రియుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్టును తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 'కేజీఎఫ్'కు బెస్ట్ యాక్షన్ విభాగంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో రెట్టించిన ఉత్సాహంో షూటింగ్ జరుపుతున్నారు. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిరంతరంగా చిత్రీకరణ జరుపుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో 'కేజీఎఫ్' చిత్ర యూనిట్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ కోలార్ ఫీల్డ్స్లోని సైనైడ్ హిల్స్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటకకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ చిత్ర షూటింగ్ వల్ల అక్కడి పర్యావరణానికి హాని కలుగుతుందని, కాబట్టి దీన్ని వెంటనే నిలిపివేయాలని కోర్టులో పిల్ వేశాడు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం షూటింగ్ను వెంటనే ఆపివేయాలని తీర్పునిచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతోంది.
మరోవైపు, సైనైడ్ హిల్స్ లాంటి లొకేషన్ల కోసం చిత్ర యూనిట్ వెదుకుతోంది. ఇది దొరకని పక్షంలో సరిగ్గా అలాంటి సెట్ను వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నిర్మాతలకు అదనపు ఖర్చు అవుతుందని అంటున్నారు. చాప్టర్ 1కు భారీ కలెక్షన్లు వచ్చాయి కాబట్టి, రెండో భాగం కోసం ఎక్కువ ఖర్చు చేసినా నష్టం ఉండదని కొందరు సూచిస్తున్నట్లు సమాచారం.