Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
మా ఆయన ఏడాదికొక అమ్మాయితో వస్తాడు.. ఆమె అలాగే వచ్చింది.. స్టార్ హీరో భార్య సంచలనం!
కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోయారు. భార్యలతో ఇంటిపోరు ఒకవైపు ఉంటె.. మరో వైపు కేసులతో సమతమతమవుతున్నాడు. దునియా విజయ్ మొదటి భార్య నాగరత్నకి, రెండవ భార్య కీర్తికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన కుటుంబం ఇలా రోడ్డున పడడానికి కారణం కీర్తి అంటూ నగరత్న సంచలన వ్యాఖ్యలు చేసింది. మీడియా సమావేశం నిర్వహించి మరీ కీర్తిపై తీవ్రమైన విమర్శలు చేసింది.
రక్తకన్నీరు సినిమా
దునియా విజయ్ మొదటి భార్య నగరత్న మాట్లాడుతూ.. మా ఆయనకు రక్త కన్నీరు సినిమా చూపించాలి. సీడీ లేకపోతే నేనే ఇస్తా. అలాగైనా ఎవరి జీవితం నాశనం అవుతుందో ఆయన గ్రహిస్తారు అని నాగ రత్న వ్యాఖ్యానించింది. నాగరత్న నుంచి విడిపోయిన దునియా విజయ్ 2015 లో నటి కీర్తి పట్టాడిని వివాహం చేసుకున్నాడు.
ఏడాదికి ఒకరితో
మా ఆయన ఏడాదికి ఒక అమ్మాయితో వస్తారు. కీర్తి కూడా అలాగే వచ్చింది. ఆమె గురించి అంతా నాకు తెలుసు. మురికి వాడల్లో పెరిగింది. విజయ్ తో ఎందుకు ఉంటోందో కూడా తెలుసు అంటూ ఎద్దేవా చేశారు. తమ కుటుంబం ఇలా వీధిన పడడానికి కారణం ఆమే అంటూ కీర్తిపై నాగరత్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
విడాకులు ఇవ్వలేదు
మా ఆయన, నేను దూరంగా ఉంటున్నా ఇంకా విడాకులు తీసుకోలేదని తెలిపారు. కీర్తి, విజయ్ కి పెళ్లి కూడా కాలేదని నాగరత్న ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ తల్లిదండ్రులు కూడా అనారోగ్యం బారిన పడ్డట్లు తెలుస్తోంది.
జిమ్ ట్రైనర్పై దాడి
జిమ్ ట్రైనర్ పై దాడి చేసిన కేసులో దునియా విజయ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దునియా విజయ్ బెయిలుపై విడుదలయ్యాడు. బెయిలు నుంచి బయటకు రాగానే విశ్రాంతి కోసం విజయ్ తాన్ రెండవ భార్య కీర్తితో కలసి మడికేరి వెళ్లినట్లు తెలుస్తోంది.