Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అది అభిమానం అంటే... రూ. లక్ష ఖర్చుతో సినిమా టిక్కెట్లు కొన్నాడు!
కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ సాండల్వుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖుల్లో ఒకరు. నవంబర్ 24, 2018లో అంబరీష్ మరణం అభిమానులను తీవ్రంగా బాధించింది. అంబి వారసుడు అభిషేక్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పలువురు వీరాభిమానులు తమ అభిమానం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అభిషేక్ నటిస్తున్న కన్నడ చిత్రం 'అమర్' మే 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అంబరీష్ అభిమానుల్లో ఒకరు ఏకంగా రూ. లక్ష ఖర్చుతో ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్లు కొనుగోలు చేశారు. అంబి మీద అభిమానం నిరూపించుకునేందుకే ఆయన ఇలా చేశారట.
కర్నాటకలోని దావన్గిరి ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే ఫ్యాన్ చిత్ర నిర్మాణ సంస్థ సందేష్ ప్రొడక్షన్స్ వారికి లక్ష చెక్ అందజేసి టిక్కెట్లు కొనుగోలు చేశారు. మంజునాథ్ చేసిన ఈ పని కర్నాటకలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని సినీ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మంజునాథ్ లాంటి అభిమానులు ఉంటే... ఏ హీరో సినిమా కూడా ప్లాప్ అవ్వదేమో? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర హీరోల అభిమానులు కూడా ఇలాంటివి చేస్తే తమ హీరో స్థాయి తగ్గకుండా, సినిమాలు ప్లాప్ అవ్వకుండా టాప్లో నిలబెట్టవచ్చని కొందరు సూస్తున్నారు.
'అమర్' మూవీ విషయానికొస్తే... ఇది దివంగత నటుడు అంబరీష్ తనయుడు అభిషేక్ నటిస్తున్న తొలి చిత్రం. ఇందులో తాన్యా హోప్, దేవరాజ్, సుధారాణి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య దర్శకత్వంలో సందేశ్ ప్రొడక్షన్స్ నిర్మించింది.