Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అది అభిమానం అంటే... రూ. లక్ష ఖర్చుతో సినిమా టిక్కెట్లు కొన్నాడు!
కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ సాండల్వుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖుల్లో ఒకరు. నవంబర్ 24, 2018లో అంబరీష్ మరణం అభిమానులను తీవ్రంగా బాధించింది. అంబి వారసుడు అభిషేక్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పలువురు వీరాభిమానులు తమ అభిమానం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అభిషేక్ నటిస్తున్న కన్నడ చిత్రం 'అమర్' మే 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అంబరీష్ అభిమానుల్లో ఒకరు ఏకంగా రూ. లక్ష ఖర్చుతో ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్లు కొనుగోలు చేశారు. అంబి మీద అభిమానం నిరూపించుకునేందుకే ఆయన ఇలా చేశారట.
కర్నాటకలోని దావన్గిరి ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే ఫ్యాన్ చిత్ర నిర్మాణ సంస్థ సందేష్ ప్రొడక్షన్స్ వారికి లక్ష చెక్ అందజేసి టిక్కెట్లు కొనుగోలు చేశారు. మంజునాథ్ చేసిన ఈ పని కర్నాటకలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని సినీ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మంజునాథ్ లాంటి అభిమానులు ఉంటే... ఏ హీరో సినిమా కూడా ప్లాప్ అవ్వదేమో? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర హీరోల అభిమానులు కూడా ఇలాంటివి చేస్తే తమ హీరో స్థాయి తగ్గకుండా, సినిమాలు ప్లాప్ అవ్వకుండా టాప్లో నిలబెట్టవచ్చని కొందరు సూస్తున్నారు.
'అమర్' మూవీ విషయానికొస్తే... ఇది దివంగత నటుడు అంబరీష్ తనయుడు అభిషేక్ నటిస్తున్న తొలి చిత్రం. ఇందులో తాన్యా హోప్, దేవరాజ్, సుధారాణి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య దర్శకత్వంలో సందేశ్ ప్రొడక్షన్స్ నిర్మించింది.