Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కోట, బాబు మోహన్ కుమారుల తరహాలో... సినీ డిస్ట్రిబ్యూటర్ దుర్మరణం!
తిరగడానికి కార్లు ఉన్నా లక్షల ఖరీదు చేసే స్పోర్ట్స్ బైకులపై మోజు పడుతున్నారు కొందరు సినీ సెలబ్రిటీలు. అయితే ఈ బైక్ రైడింగ్ సరదా కొందరిని మృత్యువు ఒడిలోకి నెట్టివేస్తోంది. మితిమీరిన వేగం వారి ప్రాణాలు హరిస్తోంది.
2003లో బాబుమోహన్ కుమారుడు పవన్ కుమార్(26) బైక్పై వస్తూ జూబ్లీహిల్స్ సమీపంలో డివైడర్ను ఢీకొని ప్రాణాలు కోల్పోగా, 2010లో కోట శ్రీనివాసరావు కుమారుడు, కోట ప్రసాద్(39) బైక్పై వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో మరో వాహనాన్ని ఢీకొని మరణించారు. 2011లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్(19) ఔటర్ రింగ్ రోడ్డుపై తన ఖరీదైన బైక్తో మితిమీరిన వేగం ప్రయాణిస్తూ అదుపు తప్పి మృతి చెందాడు.
ఇదే తరహాలో... తాజాగా మరో ప్రమాదం బెంగుళూరులో సంభవించింది. ఈ ప్రమాదంలో కన్నడ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అజయ్ చందానీ ఆదివారం(జులై 14) మరణించారు. చందానీ ఇటీవలే కొత్త స్పోర్ట్స్ బైక్ సుజుకి వి స్ట్రోమ్ 650 ఎక్స్టి కొనుగోలు చేశాడు. ఆదివారం ఉదయం బైక్ మీద వేగంగా ఇంటికి వెళుతుండగా కన్నింగమ్ రోడ్లో అదుపుతప్పింది. పోల్కు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. వెంటనే అతడిని జైన్ ఆసుపత్రికి తరలించారు. 6.30 గంటలకు ప్రమాదం జరుగగ్గా... గంటన్నరసేపు మృత్యువుతో పోరాడి మరణించాడు.