Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కేజీఎఫ్ హీరో యష్ ఇంటిపై ఐటీదాడులు.. పలువురు హీరోల పన్ను ఎగవేతపై ఆరా!
Recommended Video
పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే కారణంతో కన్నడ సినీ నటుల నివాసాలపై ఆదాయపు పన్ను అధికారులు దాడుల నిర్వహించారు. ప్రముఖ సినీ నటుల ఇళ్లపై మూకుమ్మడిగా దాడులు జరపడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేజీఎఫ్తో భారీ వసూళ్లను రాబట్టిన కన్నడ రాకింగ్ స్టార్ యష్, పునీత్ రాజ్కుమార్, శివరాజ్కుమార్ తదితరుల నివాసాలపై దాడులు నిర్వహించినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..
సినీ తారల ఇంటిపై ఆకస్మిక దాడులు
జనవరి 3, గురువారం ఉదయం తెల్లవారుజామున్నే కన్నడ సినీతారల ఇళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఐటీ అధికారుల సోదాల్లో పలు డాక్యుమెంట్లు, లెక్క తేలని నగదు లభ్యమైనట్టు సమాచారం. కడపటి వార్తలు అందేసరికి ఇంకా సినీ ప్రముఖుల ఇళ్లపై దాడుల కొనసాగుతున్నట్టు తెలిసింది.
గురువారం తెల్లవారుజామున
గురువారం తెల్లవారు జామున బెంగళూరులోని సదాశివ నగర్లోని పునీత్ రాజ్కుమార్, నగాపుర హౌస్లోని ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్, నగరబావిలోని కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరంగదుర్ నివాసంలో దాడులు నిర్వహించారు అని మీడియా కథనాలు వెలువడ్డాయి. నిర్మాత సీఆర్ మనోహర్, ప్రముఖ డిస్టిబ్యూటర్ జయన్న నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
కేజీఎఫ్ వసూళ్ల సునామీ
రాక్స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 వసూళ్లను రాబట్టింది. కేవలం కన్నడ రంగంలోనే రూ.100 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. ఇంకా ఈ సినిమాపై ప్రేక్షకుల ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నది.
మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..
బాహుబలి తర్వాత కేజీఎఫ్ మూవీ
క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం డిసెంబర్ 21న రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి హీరోయిన్గా నటించింది. ఇటీవల కాలంలో బాహుబలి తర్వాత ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించిన చిత్రంగా కేజీఎఫ్ సొంతం చేసుకొన్నది.