Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాకింగ్.. హోటల్ బిల్ కట్టకుండా పారిపోయిన దండుపాళ్యం నటి.. లక్షల్లో అమౌంట్!
Recommended Video
ఇటీవల వచ్చిన క్రైం చిత్రాల్లో దండుపాళ్యం సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నడ నటి పూజాగాంధీ దండుపాళ్యంలో డీగ్లామర్గా, బోల్డ్ రోల్లో నటించి మెప్పించింది. తాజాగా పూజ గాంధీ వార్తల్లో నిలిచింది. కన్నడ చిత్ర పరిశ్రమలో పూజ గాంధీ గురించి తరచుగా వివాదాలు వినిపిస్తుంటాయి. 2002లో నటిగా మారిన పూజా గాంధీ పలు కన్నడ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. పూజా గాంధి చేసిన నిర్వాకానికి బెంగుళూరులోని ఓ లగ్జరీ హోటల్ యాజమాన్యం ఆమెపై కేసు నమోదు చేసింది.
చీటింగ్ కేసు
పూజా గాంధీ ఇటీవల బెంగుళూరులోని ఓ విలాసవంతమైన హోటల్లో బసచేసిందట. ఏమైందో ఏమో కానీ అక్కడి సిబ్బంది కళ్లుగప్పి హోటల్ బిల్ కట్టకుండా పారిపోయినట్లు తెలుస్తోంది. సదరు నటి నిర్వాకానికి హోటల్ యాజమాన్యం ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అసలు పూజా గాంధీ ఎందుకు ఇలా చేసిందో ఎవ్వరికి అర్థం కాలేదు. కేసు నమోదైన తర్వాత పోలీసులు సమన్లు జారీ చేయడంతో పూజాగాంధీ స్పందించినట్లు తెలుస్తోంది.
లక్షల్లో బిల్లు
పూజా గాంధీ ఎగొట్టిన బిల్లు అంతా ఇంతా కాదు.. ఏకంగా 4.5 లక్షలు. కేసు నమోదైన తర్వాత 2 లక్షలు చెల్లించింది, మిగిలిన మొత్తం చెల్లించడానికి కొంత సమయం కావాలని పూజ గాంధీ హోటల్ యాజమాన్యాన్ని కోరినట్లు తెలుస్తోంది. అందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఇలాంటి వివాదాలు ఈ దండుపాళ్యం నటికి కొత్తేమీ కాదు.
నిర్మాతతో గొడవ
2011లో పూజాగాంధీ కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాత కిరణ్తో డబ్బు విషయంలో వివాదం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య ఈ వివాదం తీవ్రం కావడంతో ఒకరిపై ఒకరు కేసుకు నమోదు చేసుకున్నారు. కోర్టులో ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా కూడా వేసుకున్నారు. తాజాగా హోటల్ బిల్ విషయంలో పూజాగాంధీ ప్రవర్తించిన విధానం సినీ అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
గ్లామర్ రోల్స్
దండుపాళ్యం చిత్రంలో పాత్రకు అనుగుణంగా డీ గ్లామర్ రోల్ లో కనిపించింది. అంతకు ముందు పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసి అందాలు ఆరబోసింది. కానీ దండుపాళ్యం చిత్రం మాత్రం ఈ 35 ఏళ్ల నటికి సౌత్ మొత్తం గుర్తింపు తీసుకువచ్చింది. పూజ గాంధీ ఆర్థిక సమస్యల్లో ఉండడం వల్లే ఇలా బిల్ కట్టకుండా వెళ్లిపోయిందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.